దోపిడి ముఠా అరెస్ట్...విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ..
దోపిడి ముఠా అరెస్ట్
విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ
కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసులో భాగంగా దోపిడీ ముఠాను అరెస్ట్ చేసినట్లు నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ పేర్కొన్నారు.ఈ మేరకు సిఐ వివరాలు తెలియచేశారు. కర్నూలు నగరం,ముజాఫర్ నగర్ కు చెందిన గోర్లగట్ట నాగేంద్రుడు,బుధావర్ పేట,ప్రస్తుతం TV9 కాలనీకి చెందిన కురువ రమేష్,కర్నూలు మండలం, దిన్నేదేవరపాడు గ్రామానికి చెందిన దూదేకుల మాలిక్ బాషలు కర్నూలు బెంగళూర్ జాతీయ రహదారి
44,జగన్నాత గట్టుపై వెళ్లే ప్రేమికుల దగ్గరకు వెళ్లి వారి ఫోటోలు,వీడియోలు తీసి,వారిని బ్లాకు మెయిల్ చేస్తూ వారి నుండి డబ్బు,విలవయిన వస్తువులు తీసుకొని,ఇవ్వని వారిపై మరణాయుధాలతో చంపుతామని బెదిరించి వారి నుండి,డబ్బు,బంగారు లేదా విలువయిన వస్తువులను బలవంతంగా తీసుకొంటూ దోపిడీకి పాల్పడేవారు.అదేవిదంగా ఈనెల 19వ తేదీన పిర్యాదురాలు తనకు తెలిసిన అబ్బాయితో రాయలసీమ యూనివర్సిటీకు ఆటోలో వెళుతుండగా, అమ్మాయి,అబ్బాయిలు వెళుతున్న ఆటో ను అనుసరిస్తూ హ్యాంగౌట్ హోటల్ దాటినా తర్వాత ఆ ఆటోను ఆపి అమ్మాయి,అబ్బాయి ఫోటోతీసి,మీ తల్లిదండ్రులకు పంపుతామని,కత్తితో బెదిరించి అమ్మాయి నుండి బంగారు గొలుసు,అబ్బాయి నుండి రూ.2000 నగదు ఫోన్ పే చేయించుకొని,జేబులో ఉన్న రూ.1000 లాక్కొని తిరిగి రెండు రోజుల తర్వాత అమ్మాయి ఫోన్ కు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఆధారముగా ముద్దాయిలను గుర్తించి నేడు ముద్దాయిలను కర్నూలు-బెంగళూ ర్ హైవే,ఖైరా కేఫ్ దగ్గర ఆరెస్టు చేసి వారి నుండి రూ.10,500 నగదు,బంగారు చైను,ముద్దాయిలకు సంబందించిన మూడు మొబైల్ ఫోన్స్,ఒక కారు,స్కూటీ, ఒక కత్తి,ఐదు లీటర్ల నాటుసారాను స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తదుపరి చర్యలు నిమిత్తం విచారణ ప్రారభించినట్లు సిఐ తెలిపారు.
ప్రజలకు విజ్ఞప్తి :
పట్టణ శివార్లలో ప్రేమికుల జంటలు గాని, స్త్రీ,పురుషులు సంయుక్తంగా వెళ్ళడం గాని,ఏకాంతముగా గడపడంగాని చేయవద్దు.అలా వెళ్లి ఇలాంటి వారి చేతులలో తమ జీవితాలను నాశనం చేసుకొవద్దని అని నాల్గవ పట్టణ పోలీసులు యువతను హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి వారి భారిన పడిన యెడల అట్టి సమాచారం ను డయల్ 112 గానీ,లేదా 91211 01062కు ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Post a Comment