అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫించన్ అందాలి...అర్హత ఉండి ఫెన్షన్ రాలేదంటే కలక్టర్లదే బాధ్యత...సిఎస్...

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫించన్ అందాలి
అర్హత ఉండి ఫెన్షన్ రాలేదంటే కలక్టర్లదే బాధ్యత...సిఎస్

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
రాష్ట్రంలో అర్హతగల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఫించన్ అందించాలని ఎక్కడైనా అర్హత ఉండి,ఫించన్ రాలేదని ఫిర్యాదువస్తే అందుకు సంబంధిత జిల్లా కలక్టర్లే బాధ్యత వహిం చాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.మైనర్ ఇ రిగేషన్ ట్యాంకులు,భుగర్భ జలాలు,పియం కుసుమ్ పధకానికి భూ సంబంధిత అంశా లు,పింఛన్లు,జిల్లా జువెనైల్ జస్టీస్ కమిటీల ఏర్పాటు వాటి అమలు,ఇండియన్ ఎయిర్ ఫో ర్స్ సంబంధిత అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో స మావేశంలో మాట్లాడారు.ముందుగా పింఛన్లు పంపిణీపై సిఎస్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పెన్షన్ అందేలా చూడాలని కలెక్టర్లుకు స్పష్టం చేశారు.ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు,జిల్లా, మండల ప్రత్యేక అధికారులు తప్ప క పాల్గొనాలని ఆదేశించారు.పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధా న్యత అంశంగా తీసుకుని అర్హత గలవారందరికీ తప్పనిసరిగా ఫించన్ అందేలా చూడా లని చెప్పారు.అర్హత ఉన్నా ఫించన్ రాలేదని మీడియా,సోషల్ మీడియా లేదా మరే ఇతర మార్గాల్లోనైనా ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలక్టర్లే పూర్తి బాధ్యత వహిం చాల్సి ఉంటుందని పునరుద్ఘాటించారు.పెన్షన్ల తనిఖీకి సంబంధించి 1.35 లక్షల మందికి నోటీసులు జారీ చేసి,నెలరోజుల్లోగా ఎంపిడిఓలకు అప్పిల్ చేసుకోవాలని తెలి యజేయగా వారిలో 88.319వేల మంది ఎంపిడిఓలకు అప్పీలు చేసుకోగా,ఇంకా 23 వేల మంది అప్పీలు చేసుకోలేదని గుర్తుచేశారు.నెలరోజుల గడువులోపు అప్పీళ్ళన్నీ పరి ష్కరించాలని కలక్టర్లను ఆదేశించారు.పెన్షన్ల పంపిణీపై ఎక్కడా నెగిటివ్ ప్రసారం రా కుండా చూసుకోవాలని,అర్హత కలిగిన వారందరికీ తప్పనిసరిగా ఫెన్షన్ అందేలా చర్య లు తీసుకోవాలని స్పష్టం చేశారు.అంతకు ముందు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు,భూగర్భ జలాల పెంపు,పియం కుసుమ్ ఫధకానికి సంబంధించి భూసంబంధిత అంశాలు,జిల్లా జు వనైల్ జస్టీస్ కమిటీలు ఏర్పాటు,యూరియా లభ్యత తదితర అంశాలపై కలక్టర్లతో సిఎస్ సమీక్షించారు.ఈ సమావేశంలో సిసిఎల్ఏ జి.జయలక్మి,ఆర్టీజిఎస్ సిఇఒ ప్రఖర్ జైన్,ఐ అండ్ పిఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్ల,వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు,నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు,రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్,సె ర్ప్ సిఇఓ కురుణ,మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి,వివిధ జిల్లాల కలె క్టర్లు వర్చువల్ గా పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....