పాత్రికేయులు ఆధ్యాత్మికతను చాటడం అభినందనీయం...రెండవ రోజు పాత్రికేయ గణపతి వద్ద విశేష పూజలు,అన్నదానం... బీసీ విద్యార్థి సంఘం నాయకులు పగిడాల ఆనంద్ బాబు...
పాత్రికేయులు ఆధ్యాత్మికతను చాటడం అభినందనీయంరెండవ రోజు పాత్రికేయ గణపతి వద్ద విశేష పూజలుబీసీ విద్యార్థి సంఘం నాయకులు పగిడాల ఆనంద్ బాబు
పాత్రికేయులు వృత్తి నిర్వహణలో ఉన్నప్పటికీ మట్టి గణపతిని నెలకొల్పి ఆధ్యాత్మికతను చాటడం అభినందనీయమని బీసీ విద్యార్థి సంఘం నాయకులు పగిడాల ఆనంద్ బాబు అన్నారు.గురువారం కలెక్టరేట్ సమాచార భవన ఆవరణలో పాత్రికేయ గణపతి ఉత్సవ క మిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి గణపయ్యను ఆయన సందర్శించి పూజా కార్యక్ర మాలు నిర్వహించారు.అనంతరం ఆనంద్ బాబు సహకారంతో సుమారు 350మందికి అ న్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల నిర్వ హణలో బిజీగా ఉన్న కర్నూలు పాత్రికేయులు గణనాధుని కొలవుదీర్చి పూజ కార్యక్రమా లు నిర్వహించడం సంతోషకరం అన్నారు.ప్లాస్టర్ పారిస్ విగ్రహాలకు ప్రత్యామ్నాయం గా మట్టి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పర్యావరణహితాన్ని చాటడంపై అభినందనలు తెలిపా రు.
ప్రతిరోజు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం వ్య క్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మంజునాథ్ యాదవ్,కందనో లు శీను,రామకృష్ణ, సాయి కుమార్ నాయుడు,ఆంజనేయులు,సత్య నారాయణ, అవినా ష్,చిరంజీవి,విద్యాసాగర్,విజయ్ కుమార్,కిషోర్,గంగాధర్,అసిఫ్,పరమేష్,జయబాబు, తుపాకుల రమేష్, హరికృష్ణ,పాత్రికేయులు విద్యార్థి యువజన సంఘం నాయకులు కో నేటి వెంకటేశ్వర్లు,పిడిఎస్ యు.భాస్కర్,రమణ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment