డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్...
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
మెగా డీఎస్సీ 2025 శుక్రవారం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుండగా శ్రీనివాస్ బీఈడీ కళాశాల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సందర్శించారు.ఈ కేంద్రంలో 218 మంది అభ్యర్థుల ధ్రువీకరణ జరు గుతున్న నేపథ్యంలో వెరిఫికేషన్ బృందాలతో ఆయన మాట్లాడారు.శుక్రవారం హాజర య్యేందుకు కాల్ లెటర్స్ అందుకున్న వాళ్లు హాజరవుతున్నారని సర్టిఫికెట్లకు పరిశీలన సంబంధించి ఏరోజుకారోజు వ్యక్తిగత లాగిన్లలో సమాచారం అందుతుందని ఏ కేంద్రానికి హాజరు కావాలనే వివరాలతో కూడిన సమాచారం ఆధారంగా అభ్యర్థులు హాజరు కాను న్నారని డీఈఓ శ్యామ్యూల్ పాల్ వివరించారు.
సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీ లించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.వసతులు ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.సర్వర్ సమస్యలు పునరావృతం కాకుండా నిరంతర విద్యుత్ సౌకర్యంతో హైఫై ఇంటర్నెట్ తో నిర్వహించాలని సూచించారు.అభ్యర్థులు ఎక్కడ ఇబ్బందులు పడడానికి వీలులేదని దానికి తగ్గట్టు ఏర్పాట్లు వేగవంతం చేయాలని సూచించారు.జాప్యం కా కుండా దృవీకరణ పత్రాల పరిశీలన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు టి.అబ్రహం,ప్రతాపరెడ్డి, కడప ప్రాంతీయ సంచాలకులు కే.శ్యామ్యూల్,డీఈఓ శ్యామ్యూల్ పాల్,నంద్యాల డిఈఓ జనార్దన్ రెడ్డి, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment