అత్యవసర సేవలకు డయల్ 112కు కాల్ చేయండి...విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ...
అత్యవసర సేవలకు డయల్ 112కు కాల్ చేయండివిక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ
కర్నూలు జిల్లా ప్రజలు,బాధితులు అత్యవసర పరిస్ధితులు,ఆపద సమయాల్లో,ఎమైనా స మస్యలు,అసాంఘిక కార్యకలపాలు ఎదైనా మీ దృష్టికి వచ్చినా వెంటనే డయల్ 112 కి కాల్ చేసి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకట నలో తెలిపారు.గొడవలు,తగాదాలు,కుటుంబ సమస్యలు,అనుమానాస్పద వ్యక్తుల కదలి కల వివరాలు ఎదైనా మీ దృష్టికి వచ్చిన కూడా వెంటనే డయల్ 112 కి జిల్లా ప్రజలు కా ల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు.డయల్ 112కు కాల్ చేసినా వెం టనే స్పందించి పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో బ్లూ కోల్ట్స్,రక్షక్,పోలీస్ వారు కేవలం 15 ని మిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను తెలుసుకుని,తగిన చర్యలు తీ సుకోవడం జరుగుతుందన్నారు.డయల్ 112 హెల్ప్ లైన్ నెంబర్ 24X7 కమాండ్ కం ట్రోల్ కు అనుసంధానమై అందుబాటులో ఉంటుందన్నారు.క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న బ్లూ కోల్ట్స్,రక్షక్,పోలీస్ సిబ్బందికి క్షణాల్లో సమాచారం వెళుతుందన్నారు.జిల్లాలోని ప్ర జలు గతంలో పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ గా ఉన్న డయల్ 100నంబర్ కు బదులు హె ల్ప్ లైన్ నెంబర్ డయల్ 112నంబర్ గా ప్రభుత్వం మార్చడం జరిగిందని,ప్రజలు ఈ విష యాన్ని గమనించి డయల్ 112 హెల్ప్ లైన్ నెంబర్ సద్వినియోగం చేసుకుని శాంతి భ ద్రతల పరిరక్షణలో తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించి పోలీసు శాఖకు సహ కరించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల జిల్లాలోని గ్రా మాలు,పట్టణ శివార్లలో వాగులు,వంకలు,చెరువులు,కుంటలు,కాలువలు పూర్తిగా నిండి పోవడం,దసరా సెలవుల నేపథ్యంలో పిల్లలు,యువకులు ఈతకు వెళ్లడం వల్ల ప్రమాదక రమైన ఘటనలు జరిగే అవకాశం ఉందని,తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నా రో గమనించాలని,జాగ్రత్తలు తీసుకోవాలని,నది తీరా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడైనా ఎదైనా సమస్యలుంటే వెంటనే డయల్ 112కి సమాచారం అం దించాలని విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment