రూ.30వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన జూనియర్ లైన్మెన్...
రూ.30వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి
చిక్కిన జూనియర్ లైన్మెన్
రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ (ACB) అధికారులు మరోమారు లంచగొండిని పట్టుకున్నా రు.ప్రజల ఇళ్లకు విద్యుత్ సరఫరా పనుల్లో సహాయం చేస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన జూనియర్ లైన్మెన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.వివరాలు ఇలా ఉన్నాయి ...గచ్చిబౌలి డివిజన్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్మెన్ శ్రీకాంత్ గౌడ్,ఫిర్యాదు దారుని ఇంటికి 5 కె.వి.నుండి 11కె.వి వరకు విద్యుత్ ప్రవాహాన్ని కొనసాగించే పనుల్లో సహాయం చేస్తానని,వైరింగ్ మార్చడంలో, అలాగే ఇంట్లో ఉన్న మీటర్ను విప్పి మళ్లీ సీల్ చేయడంలో అధికారిక సహకారం అందిస్తానని చెప్పి రూ.30వేలు లంచం డిమాండ్ చే శాడు.ఫిర్యాదుదారు అనిశాకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు పన్నిన వలలో జూనియర్ లైన్మెన్ చిక్కాడు.ముందుగా ఒప్పుకున్న లంచం మొత్తంలో రూ.11వేలు తీ సుకుంటూ ఉండగా ఆయనను అధికారులు పట్టుకుని సాక్ష్యాలతో అదుపులోకి తీసుకున్నా రు.ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి లంచం అడిగే ఏ ప్రభుత్వ ఉద్యోగి/అధికారి పట్ల వెంటనే ఫిర్యా దు చేయాలని తెలంగాణ అవినీతి నిరోధకశాఖ పిలుపు నిచ్చింది.దీనికోసం ప్రజలు నేరు గా టోల్ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయవచ్చు.అదేవిధంగా వాట్సాప్ : 94404461 06, ఫేస్బుక్ : Telangana ACB,ఎక్స్ (Twitter): @TelanganaAC B,వెబ్సైట్ : acb.telangana.gov.in ద్వారా కూడా సమాచారం అందించవ చ్చని అధికారులు తెలిపారు.ఏసీబీ అధికారులు ఫిర్యాదుదారుల/బాధితుల వివరాలు పూ ర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.
Comments
Post a Comment