35వ వార్డు,శివప్ప నగర్ లో రోడ్లు,కాలువలు నిర్మించాలి...సిపిఎం...

35వ వార్డు,శివప్ప నగర్ లో రోడ్లు,కాలువలు 
నిర్మించాలి...సిపిఎం

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరపాలక సంస్థ కల్లూరు 35వ వార్డు,శివప్ప నగర్ కాలనీలో రోడ్లు,కాలువ లు నిర్మించాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప నగర కమిటీ సభ్యులు బి.కే.రామకృష్ణ వార్డ్ కార్యదర్శి బి.పరమేష్,సూర్యనారాయణ కోరారు.సోమ వారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణకి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప,నగర కమిటీ సభ్యులు బి.కె.రామకృష్ణ మాట్లాడుతూ కాలనీ ఏర్పడి దాదాపు 20సంవత్సరాలు అవుతున్నట్లు తెలిపారు.చింత లముని నగర్ లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఎదురుగా ఉన్న శివప్ప నగర్ కాలనీలో అనేక మంది పేద ప్రజలు నివాసం ఉంటున్నారని,కాలనీలో రోడ్లు లేక వర్షం పడిందంటే మొ త్తం బురదమయమై,ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లాలంటే కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని ఆందో ళన చెందారు.వర్షం పడిందంటే వర్షం నీళ్లు నిలువ ఉండి దోమలకు నిలయంగా మారి రాత్రిపూట దోమల బెడదతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పారు. దోమ ల బారిన పడి అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు.కాలువలు లేని కారణంగా మురి కి నీరు రోడ్లపై పారుతూ వచ్చిపోయేవారికి దుర్వాసన వెదజల్లుతూ,మురికి కూపంలో రో డ్లు ఉన్నాయని తెలిపారు.వెంటనే డిప్యూటీ కమిషనర్ చొరవ తీసుకొని 35వ వార్డు శివ ప్ప నగర్ లో పర్యటించి సిసి రోడ్లు కాలువలు వేయాలని వారు డిమాండ్ చేశారు.అనం తరం అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ సంబంధిత అధికారులకు కాలనీలో పర్యటించి సమ స్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో బి.పర మేష్ ,జే.శ్రీనివాసులు,పి.మాధవ్,రాజన్న,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....