బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జి జాతికి అంకితం చేసిన భారత ప్రధాని...జి.రమేష్,కర్నూలు బిజినెస్ ఏరియా పిజిఎం...

బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జి జాతికి అంకితం చేసిన భారత ప్రధాని
జి.రమేష్,కర్నూలు బిజినెస్ ఏరియా పిజిఎం

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అ భివృద్ధి చేసిన బిఎస్ఎన్ఎల్ 4జి సేవలను భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడి శాలోని జార్సుగూడ నుండి ప్రారంభించారని కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనర ల్ మేనేజర్ జి.రమేష్ తెలిపారు.శనివారం కర్నూలు జిల్లా,పత్తికొండ మండలం,పులికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన 4జి టవర్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి.రమేష్ హాజరై మాట్లాడుతూ జాతీయ సమాచార మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో భాగంగా రూ.37,500 కోట్లతో స్వదేశీ పరిజ్ఞానంతో ( మేక్ ఇన్ ఇండియా) దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేసిన 97,500 టవ ర్లను,దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 108గ్రామాల్లో 4జి సేవలను ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభిస్తూ జాతికి అంకితం చేశారని అన్నారు.ఇందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10గ్రామాల్లో కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం,పులికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన 4జి శాచురేషన్ మొబైల్ టవర్ ను ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభించారని తెలిపా రు.ఈ స్వదేశీ 4జి నెట్వర్క్ ను సాఫ్ట్ వేర్ అప్డేట్ తో త్వరలో 5జీ గా ఆధునీకరించుకోవ చ్చు అని తెలిపారు.కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 376టవర్లు 4జిగా మార్చడం జరి గిందని,అదనంగా 100కుపైగా 4జి టవర్లు స్యాచురేషన్,యాడ్ ఆన్ ప్రాజెక్టు కింద రాబో తున్నాయని పేర్కొన్నారు.బిఎస్ఎన్ఎల్ 4జి ద్వారా డిజిటల్ చెల్లింపులు,డిజిటల్ లెర్నిం గ్,స్మార్టర్ వ్యవసాయము,టెలి మెడిసిన్ వంటి కార్యక్రమాలను సులువుగా చేసుకోవచ్చని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్,తహసీల్దార్ హుస్సేన్ సాహెబ్,ఎంపీడీఓ కవిత,ఎలక్ట్రికల్ ఏడిఈ రామకృష్ణ,పులికొండ సర్పంచ్ ఎం.అనసూ యమ్మ,బిఎస్ఎన్ఎల్ డిఇ రూరల్ నారాయణ స్వామి,ఏజీఎం సేల్స్ అండ్ మార్కెటింగ్ దే వచంద్ నాయక్,పత్తికొండ జెటిఓ తిరుమలేష్,అదేవిదంగా కర్నూలు టెలిఫోన్ ఎక్స్చేం జిలో ఏర్పాటుచేసిన లైవ్ కార్యక్రమంలో ప్రస్తుత డీజీఎం సాయినాథ్,డిఈలు,సంస్థ ఉ ద్యోగులు,ఫ్రాంచైజీలు,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...