పెద్దటేకూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ...హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి...కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్...
పెద్దటేకూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీహాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డికె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్
కల్లూరు మండలం,పెద్దటేకూరులో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంను మరింత పారదర్శకంగా, సమర్దవంతగా అమలు చేయడములో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కల్లూరు తహసీల్దార్ కె.ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి పా ణ్యం ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి హాజరై ఆమె చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశా రు.ఈ సందర్బంగా గౌరుచరిత రెడ్డి మాట్లాడుతూ ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా లబ్ది దా రులు వారికి వచ్చే రేషన్ వివరాలు,సభ్యుల వివరాలు,ఇచ్చే సరకులు వాటి వివరణ QR code ద్వారా తెలుసుకోవచ్చని తెలియజేశారు.
లబ్దిదారులు సమస్యలను తెలియజేసేందుకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులో టోల్ ఫ్రీ హెల్ప్ లై న్ నంబర్ 1967ను కూడా ముద్రించడము జరిగిందన్నారు.అదేవిధంగా సూపర్ జిఎ స్ టి-సూపర్ సేవింగ్స్ గురుంచి ప్రజలందరు తెలుసుకోవాలని సూచించారు.ప్రతి వస్తువు ఎంత జిఎస్ టి తగ్గిందో తెలుసుకోవాలని తెలియజేశారు.అదేవిధంగా ప్రభుత్వ పథకా ల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో కల్లూరు ఎంపీడిఓ,అర్బన్ ఫైనాన్స్ కార్పొరే షన్ చైర్మన్ రామాంజనేయులు,ఎంపిటిసి మునిస్వామి,సర్పంచ్ పద్మావతమ్మ,తడకనప ల్లె సర్పంచ్,సహారాబీ,మాజీ ఎంపిపి మాదేష్,మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ దేవేం ద్రరెడ్డి,ఇతర నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment