కర్నూలు నగరంలో నాసిరకం రోడ్లు వేసిన మున్సిపల్ కాంట్రాక్టర్ పై,పర్యవేక్షణ చేసిన ఇంజనీర్ పై చర్యలు తీసుకోవాలి...
కర్నూలు నగరంలో నాసిరకం రోడ్లు వేసిన మున్సిపల్ కాంట్రాక్టర్ పై,పర్యవేక్షణ చేసిన ఇంజనీర్ పై చర్యలు తీసుకోవాలిసిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్
కర్నూలు నగరంలోని నెహ్రూ రోడ్డు నందు గత నాలుగు నెలల క్రితం వేసిన సిసి రోడ్డు చి న్నపాటి వర్షానికి కంకర తేలి గుంతలు పడ్డాయని నాసిరకంగా రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పై,మున్సిపల్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశా య్ డిమాండ్ చేశారు.ఆదివారం సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం.రాజశేఖర్ నాయకత్వంలో నెహ్రు రోడ్డు నందు నాసిరకంగా వేసినా రోడ్డు లను పరిశీలించారు.ఈ సందర్భంగా డి.గౌస్ దేశాయ్ మాట్లాడుతూ సిసి రోడ్ అంటేనే దాని కాలపరిమితి కనీసం 20సంవత్సరాలుపైబడి ఉంటుంది.కానీ నెహ్రూ రోడ్డులో వేసి న కొత్త సి.సి రోడ్డు నాలుగు నెలలకే గుంతలు పడడం చూసిన తర్వాత ఇంజనీర్లకు స్థాని క రాజకీయ నాయకులకు ఎంత కమిషన్ ముట్టచెప్పారు.అవినీతి ఎంత జరిగిందో చా లా స్పష్టంగా అర్థమవుతుందని ఆయన తెలిపారు.మున్సిపల్ అధికారులు కళ్ళు మూసు కుని ఫైళ్ళపై సంతకాలు పెట్టి బిల్లులు మంజూరు చేశారని ఆయన విమర్శించారు.కనీసం క్వాలిటీ కంట్రోల్ అధికారులైన ఇంత నాసిరకమైన రోడ్లు వేస్తే ఎందుకు పరిశీలించలేదు ఎందుకు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోలేదు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చే శాడు.కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు కల్వర్ట్ లు,డివైడర్ల పేరుతో జరుగుతున్న పనుల్లో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని,పర్యవేక్షణ చేయాల్సిన ఇంజనీ ర్లు పర్యవేక్షణ చేయడం లేదని ఆయన విమర్శించారు.ప్రజాధనాన్ని తమకు ఇష్టం వచ్చిన ట్లు దుర్వినియోగం చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ కూర్చొని ఆయన ఘాటుగా విమర్శించా రు.ఇప్పటి కైనా మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకొని ఎక్కడైతే నాసిరకం పనులు జరు గుతున్నాయో గుర్తించి ఆ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని,తిరిగి వారి సొంత నిధు లతోనే అక్కడ రోడ్లు వేయించాలని లేదంటే నిధులు రికవరీ చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.లేకపోతే సిపిఎం పార్టీ అవినీతి అధికారులపై ప్రజాధనాన్ని దుర్విని యోగం చేస్తున్న కాంట్రాక్టర్ లపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు.ఈ పర్యటనలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.ఎం.డి. షరీఫ్,అబ్దుల్లా,సిపిఎం సీనియర్ నాయకులు పార్వతయ్య,బజార్,శాలి,దామోదర్,తదిత రులు పాల్గొన్నారు.
Comments
Post a Comment