వివాహిత ఆస్తి అత్తింటికే...పుట్టింటి వారికి చెందదు...
వివాహిత ఆస్తి అత్తింటికే...పుట్టింటి వారికి చెందదుపెళ్లయ్యాక మహిళ గోత్రం మారుతుందివారసత్వ హక్కులపై సుప్రీం తీర్పు
భర్త,పిల్లలు లేని ఓ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె ఆస్తి అత్తిం టివారికే చెందుతుందని,పుట్టింటి వారికి కాదని సుప్రీంకోర్ట్ కీలక తీర్పు వెలువరించింది .వివాహం అనంతరం మహిళ గోత్రం మారుతుందని కోర్టు పేర్కొంది.హిందూ వారసత్వ చట్టం,1956లోని సెక్షన్ 15(1)(బీ)ని సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్పై విచారణ సందర్శంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.ఈ సెక్షన్ ప్రకారం వీలునామా రాయ కుండా హిందూ మహిళ మరణిస్తే,ఆమెకు భర్త,పిల్లలు లేకపోతే ఆమె ఆస్తి ఆమె భర్తకు చెందిన వారసులకు చెందుతుంది.చట్టంలో ఇమిడి ఉన్న సాంస్కృతిక ఛట్రాన్ని అర్థం చే సుకోవాలని జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లకు గు ర్తు చేసింది.వాదించడానికి ముందు మీరు కొన్ని గుర్తుంచుకోవాలి.ఇది హిందూ వారస త్వ చట్టం.హిందూ అంటే అర్థం ఏమిటి హిందూ సమాజం ఎలా నియంత్రించబడుతుంది లాంటి పదాలన్నీ మీకు నచ్చకపోవచ్చు.కాని కన్యాదానం జరిగినప్పుడు ఆమె గోత్రం మా రుతుంది.ఆమె ఇంటిపేరు మారుతుంది.ఆమె భర్త నుంచి మనోవర్తి కోరవచ్చు అని ధర్మాస నం పేర్కొంది.
Comments
Post a Comment