అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరిని వీడండి...వెంటనే నోటీసులు జారీ చేసి,చార్జిషీట్ దాఖలు చేయండి...
అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరిని వీడండివెంటనే నోటీసులు జారీ చేసి,చార్జిషీట్ దాఖలు చేయండిఎల్ఆర్ఎస్ పథకం క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించండినగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశాలు
కర్నూలు నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరిని వీడాలని,వెంటనే నోటీసులు జారీ చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధి కారులను ఆదేశించారు.శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ భవనంలో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు,సిబ్బందితో కలిసి ఓపెన్ ఫోరం కా ర్యక్రమం నిర్వహించారు.పలువురు అర్జీదారులు తమ సమస్యలను చెప్పగా,జాప్యానికి కా రణాలను అడిగి,చట్టపరిధిలో వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారు లను ఆదేశించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...ప్రతి సచివాలయ పరిధిలో సంబంధిత ప్లానింగ్ కార్యదర్శి,ఇతర కార్యదర్శుల సహాయం తీసుకుని అక్రమ నిర్మాణాలు గుర్తించాలని అన్నారు.అప్రూవల్ ఉందా? ప్లాన్ విరుద్ధంగా ఏమైనా నిర్మాణాలు చేస్తున్నా రా? చెక్లిస్ట్ ప్రకారం పత్రాలు ఉన్నాయా? అనే అంశాలను నిశితంగా పరిశీలించాలని సూచించారు.అందుకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలకు వెంటనే నోటీసులు జారీ చేసి,చా ర్జిషీట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు.అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎ స్) పథకంపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విస్తృత అవగాహన కల్పించాలని కమిషనర్ సూ చించారు.ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్,డీసీసీ వెంకటరమణ,పట్టణ ప్రణాళిక అధి కారి అంజాద్ బాష,సూపరింటెండెంట్ సుబ్బన్న,సిబ్బంది అనంత వెంకటేష్,తదితరులు పా ల్గొన్నారు.
Comments
Post a Comment