కారు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలి...
కారు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలికాపరి ఎల్లరాముడు కుటుంబానికి రూ.50లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలిఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం డిమాండ్
కారు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి ఎల్లరాముడు కుటుంబానికి 50 లక్షల ఎ క్స్ గ్రేషియా చెల్లించి మృతి చెందిన గొర్రెలకు ఒక్కొక్కటికి రూ.10వేలు నష్టపరిహారం చె ల్లించాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు గోవిం దు,రాముడు,శ్రీనివాసులు,వెంకటరాముడు,మల్లేష్ లు ప్రభుత్వాన్ని కోరారు.మంగళవా రం సంఘటన స్థలాన్ని జిల్లా గొర్రెల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు,కల్లూర్ సింగి ల్ విండో చైర్మన్ పర్ల శేఖర్,వెంకట్ రాముడు,పెద్దపాడు ధనుంజయ్,వెంకటశివుడు,చి న్నటేకూరు పెద్ద ఈశ్వరయ్య,పందిపాడు భీష్ముడు,చెట్ల మల్లాపురం వెంకట్రాముడులు సం దర్శించి ఘటన జరిగిన తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క ర్నూలు జిల్లా,కల్లూరు మండలం,బస్తిపాడు గ్రామానికి చెందిన ఎల్లా రాముడు అనే గొర్రె ల కాపరి కల్లూరు మండలం,చిన్నటేకూరు గ్రామం దగ్గర నేషనల్ హైవే రోడ్డుపై గొర్రెలను దా టిస్తుండగా కర్నూలు నుండి వేగంగా వస్తున్న కారు గొర్రెల మందపై దూసుకెళ్లంతో 33 గొర్రెలతో సహా గొర్రెల కాపరి ఎల్లరాముడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నా రు.ఎల్లా రాముడికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారని,కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ కు టుంబం అనాధ అయిందని ఆవేదన చెందారు.కావున ప్రభుత్వం స్పందించి కారు ప్రమా దంలో చనిపోయిన ఎల్లా రాముడు కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించి కుటుంబాన్ని ఆదుకోవాలని,అదేవిధంగా చనిపోయిన గొర్రెలకు ఒక్కొక్క గొర్రెకు రూ.10 వేలు నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Post a Comment