ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి...
ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి
మేడ్చల్ జిల్లా,ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.వెంచర్కు అనుమతి కోసం రూ.5 లక్షలు లం చం డిమాండ్ చేశారు.ఇప్పటికే లక్ష రూపాయలు అడ్వాన్సుగా తీసుకున్న రాధాకృష్ణ రెడ్డి...శనివారం మరో రూ.3.5లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.దీంతో ఆయనను అదుపు లోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. రాధాకష్ణారెడ్డి ఇల్లు,కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
Comments
Post a Comment