పాలిటెక్నిక్ విద్యార్థిపై దాడి...ఆరుగురు విద్యార్థులు సస్పెండ్...
పాలిటెక్నిక్ విద్యార్థిపై దాడిఆరుగురు విద్యార్థులు సస్పెండ్
తల్లితండ్రులు తమ ఉద్యోగాలు,ఉపాధి, వృత్తులలో తీరికలేని జీవనం సాగిస్తూ...ఎన్నో కష్టాలు పడుతూ...తమ కష్టాలు పిల్లలు అనుభవించకూడదు అనే ఆలోచనతో తాము సంపాదించిన ఆదాయం సరిపోక పోయిన అప్పులు చేసి తమ పిల్లల భవిష్యత్ కోసం ఉ న్నత విద్య అందించాలనే లక్ష్యంతో సుదూర ప్రాంతాల్లోని కళాశాల్లో చేర్పిస్తున్నారు.అ యితే ఇందులో తల్లితండ్రుల కష్టాన్ని గుర్తించిన వారు క్రమశిక్షణతో తమ విద్యాబ్యాసం పూర్తి చేసి ఉన్నత స్థానానికి చేరుకుంటున్నారు.కాని మరి కొంతమంది తల్లితండ్రులు ప డుతున్న కష్టాలను గుర్తించలేక,అహంకారంతో వ్యవహారిస్తూ సమాజ ద్రోహులుగా నిలు స్తున్నారు.సమాజంలో తలెత్తుకుని జీవనం సాగిస్తున్న తల్లితండ్రులకు కూడా చెడ్డ పేరు తీ సుకువస్తున్నారు.ఇలాంటి విద్యార్థుల తీరు,విధి,విధానాలు గమనించడంలో నిర్లక్ష్యం వ హిస్తున్నారంటూ ప్రజలు నిలదీస్తుంటే...సమాధానం లేని నేరస్తులుగా తల్లితండ్రులు శిక్ష అనుభవిస్తున్నారు.ఈ నేపథ్యంలో జరిగిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది.వివరాలు ఇలా ఉన్నాయి...తిరుపతి జిల్లా,నారాయణ వనం మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ పాలిటెక్నిక్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిపై ఈ నెల 20న సీ నియర్ విద్యార్థులు దాడి దాడి చేశారు.బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ నెల 25న పోలీ సులు కేసు నమోదు చేశారు.ఘటనలో పాల్గొన్న ఆరుగురు విద్యార్థులను కాలేజీ యాజ మాన్యం తాజాగా సస్పెండ్ చేసింది.ఒక అమ్మాయి విషయంలో ఈ గొడవ జరిగినట్లు తె లుస్తోంది.ఏదిఏమైనా ఈ ఘటన అమానుషం అని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తు న్నాయి.సస్పెండ్ కు గురైన విద్యార్థుల భవిష్యత్ నేడు ప్రశ్నార్థకంగా మారింది.విద్యార్థులు చేసిన నేరానికి కారుకులు తల్లితండ్రులా? పాలకులా? నిభందనలు పాటించని ఆ ఇంజి నీరింగ్ కళాశాల యాజమాన్యమా? అనే ప్రశ్నలు సమాజంలో పెద్దఎత్తున చర్చకొనసాగు తోంది.
Comments
Post a Comment