అసమానతలు లేని సమాజం కోసం పనిచేయడమే చేయడమే భగత్ సింగ్ కు నిజమైన నివాళి...DYFI...
అసమానతలు లేని సమాజం కోసం పనిచేయడమే భగత్ సింగ్ కు నిజమైన నివాళి...DYFI
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,32వ వార్డ్,ముజఫర్ నగర్ లో DYFI ఆధ్వర్యంలో ము జఫర్ నగర్ నాయకులు వి.దనేష్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా భగత్ సింగ్ 118 జ యంతి వేడుకలు నిర్వహించారు.ముందుగా నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా DYFI జిల్లా కార్యదర్శి అబ్దుల్లా,న్యూ సిటీ కార్యదర్శి హుస్సేన్ భాష మాట్లాడుతూ బ్రిటిష్ పరాయి పాలన నుండి దేశానికి స్వా తంత్రం తీసుకురావాలని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎన్నో వీరోచిత పోరాటాలు భ గత్ సింగ్ చేశాడని,సమాజంలో ప్రజలందరూ ఎటువంటి అసమానతలు లేకుండా బతకా లని,సోదర భావంతో మెలగాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే ప్రాణాలర్పించిన ఘనుడు భగత్ సింగ్ వారు కొనియాడారు.నేడు దే శంలో,రాష్ట్రంలో నిరుద్యోగం,అవినీతి,అధిక ధరలతో ప్రజలు కొట్టిమిట్టాడుతుంటే ప్రభు త్వాలు మాత్రం ఇవేవీ సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవే ట్,కార్పొరేట్ వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగి ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందని,కాబట్టి ప్రభుత్వం వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న 20లక్షల పోస్టుల భర్తీ చేయాలని,అదేవిధంగా రాష్ట్రంలో 1.86లక్షలు పో స్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో భగత్ సింగ్ స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై,ప్రధానంగా నిరుద్యోగంపై పె ద్దఎత్తున పోరాటాలు చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముజఫర్ నగర్ సురే ష్,శ్రావణ్,అఖిల్,గిరి,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment