పని చేయకుండానే రెండు సంస్థల నుంచి రూ.37లక్షల జీతం పొందిన ఓ అధికారి భార్య...
పని చేయకుండానే రెండు సంస్థల నుంచి రూ.37లక్షల జీతం పొందిన ఓ అధికారి భార్య
ఎటువంటి పని చేయకుండానే ఓ అధికారి భార్య రెండు సంస్థల నుంచి రూ.37లక్షల జీ తం పొందిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రాజ్ కంప్ ఇన్ఫో సర్వీసెస్ లో ఐటీ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రద్యుమ్నా దీక్షిత్ అనే అధికారి భార్య ఏ పని చేయకుండానే లక్షల రూపాయల జీతాన్ని పొందిందని ఆరోపిస్తూ...ఓ వ్య క్తి రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి...ఓరియన్ ప్రో సొల్యూషన్స్,ట్రీజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థల కు ప్రభుత్వ టెండర్లు ముట్టజెప్పినందుకుగాను ఐటీ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రద్యుమ్నా దీక్షిత్,తన భార్యను ఆయా కంపెనీలలో ఉద్యోగిగా నియమించుకోవాలనే షరతు పెట్టా డు.అందుకు అంగీకరించిన ఆ సంస్థలు వారి వద్ద ప్రద్యుమ్నా దీక్షిత్ భార్య పూనమ్ దీక్షిత్ పని చేస్తున్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారు.దీంతో రెండేళ్లుగా ఆమెకు ఆయా కంపె నీల నుంచి నెలవారీ జీతం అందుతోంది.రెండేళ్ల నుంచి ఇప్పటివరకు రెండు కంపెనీలు ఆమెకు మొత్తం రూ.37లక్షల వేతనాన్ని అందించాయి.ఈ విషయంపై దర్యాప్తు చేయా లని రాజస్థాన్ హైకోర్టు అవినీతి నిరోధక బ్యూరో (ACB)కు ఆదేశాలు ఇవ్వడంతో ఈ ఏ డాది జులై,3వ తేదీన అధికారులు విచారణ ప్రారంభించారు.దర్యాప్తులో ఓరియన్ ప్రో సొల్యూషన్స్,ట్రీజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగిగా పేర్కొంటూ...2019 సెప్టెంబ ర్,2020 మధ్య పూనమ్ దీక్షిత్ కు చెందిన ఐదు బ్యాంకు ఖాతాలకు రూ.37లక్షల నెల వారీ జీతం బదిలీ అయినట్లు తేలింది.అయితే ఈ రెండేళ్లలో ఆమె ఒక్కరోజు కూడా ఆ కం పెనీలకు వెళ్లలేదని అధికారులు గుర్తించారు.పూనమ్ దీక్షిత్ ఆయా కంపెనీలలో పనిచే స్తున్నట్లు తెలిపే నకిలీ హాజరు నివేదికలకు ప్రద్యుమ్నా దీక్షిత్ స్వయంగా ఆమోదం తెలిపి నట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Post a Comment