త్వరలో లబ్ధిదారులకు 976 గృహాలు కేటాయింపు...టిడ్కోలో సకల సదుపాయాల కల్పనకు చర్యలు...పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్...
త్వరలో లబ్ధిదారులకు 976 గృహాలు కేటాయింపుటిడ్కోలో సకల సదుపాయాల కల్పనకు చర్యలుపి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్
కర్నూలు నగర శివారు జగన్నాథగట్టు వద్ద ఉన్న ఎన్టీఆర్ కాలనీలో 976మంది టిడ్కో ల బ్ధిదారులకు త్వరలో గృహాలను కేటాయించేందుకు చర్యలు వేగవంతం చేశామని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర మంత్రులు టీజీ భరత్,పి.నారాయణ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నామన్నారు.
ప్రస్తుతం టిడ్కో గృహాల్లో పెయింటింగ్,కార్పెంట్రీ,ప్లంబింగ్ వంటి పనులు వేగంగా కొన సాగుతున్నాయని పేర్కొన్నారు.రహదారులు,డ్రైనేజీ వ్యవస్థ,తాగునీరు, విద్యుత్ దీపాలు, రేషన్,పెన్షన్ వంటి ప్రాథమిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని,అద నంగా పోలీస్ ఔట్ పోస్ట్, అర్బన్ హెల్త్ సెంటర్,అంగన్వాడీ కేంద్రం వంటి సౌకర్యాలు క ల్పించేందుకు చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు.లబ్ధిదారులు త్వరితగతిన రిజిస్ట్రే షన్ ప్రక్రియ పూర్తి చేసుకుని తమ ఇళ్లలోకి ప్రవేశించాలని కమిషనర్ సూచించారు.
Comments
Post a Comment