వార్డులలో రోడ్లు,డ్రైన్లు,వీధిలైట్లు, మరుగుదొడ్ల స్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలి... ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కు సిపిఎం వినతి అందచేత...
వార్డులలో రోడ్లు,డ్రైన్లు,వీధిలైట్లు,మరుగుదొడ్లు, స్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలిప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కు సిపిఎం వినతి అందచేత
కర్నూలు నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్ లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్ కి వార్డులలో ఉన్న సమస్య ల పరిష్కరించాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగ ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.సుధాకరప్ప,నగర కమిటీ సభ్యులు బి.కే.రామకృష్ణ,కల్లూరు కార్యదర్శి జె.శ్రీనివాసులు మాట్లాడుతూ 32వవార్డులో హంద్రీనది వెంట ముజఫర్ నగ ర్,ఐఎంఎల్ డిపో నుండి కల్లూరు హంద్రీ బ్రిడ్జి వరకు మురికి కాలువ నిర్మించాలని,సిసి రోడ్లు వేయాలని,అలాగే గంగావతి నగర్ లో ఉన్న మహిళల మరుగుదొడ్డి ఈ మధ్యకా లంలో వచ్చిన హంద్రీ నదికి వచ్చిన వరద వల్ల మొత్తం కూలిపోయిందని అన్నారు.ఆ సా మూహిక మరుగుదొడ్డిని రిపేరు చేయాలని,అక్కడ లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.33వ వార్డులో స్మశాన వాటిక పూర్తిగా కంపచెట్లతో నిండి చనిపోయిన శవాలను ఎక్కడ దహనం చేయాలో తెలియని పరిస్థితి ఉందని,స్మశాన వాటికలో వెంట నే కంప చెట్లు తొలగించి,కాంపౌండ్ వాల్ నిర్మించి,వీధిలైట్లు వేయాలని కోరారు.అలాగే కల్లూరు ఊర వాకిలి దగ్గర త్యాగరాజ స్వామి గుడి నుండి దేవనగర్ వరకు హంద్రీ కాజు వే పై ఐమాక్స్ లైట్లు వేయాలన్నారు.35వ వార్డులో ఫారుక్ నగర్,ఉమామహేశ్వరి నగర్ లో రోడ్లు కాలువలులేని కారణంగా వర్షం వచ్చిందంటే రోడ్లు బురదమయంగా మారి,ఇళ్ల ల్లోకి వెళ్లే పరిస్థితి లేదని అందుకు ఫరూక్ నగర్,ఉమామహేశ్వరి నగర్ లో సిసి రోడ్లు కా లువలు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు.అనంతరం కమిషనర్ పి.విశ్వనాధ్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఇచ్చిన అర్జీలను పరిశీలించి,సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్క రించాలని ఆదేశాలు జారీ చేశారు.
Comments
Post a Comment