అందరితోపాటు ఇంటి పన్నులు చెల్లిస్తున్నా...మాపై వివక్షత ఎందుకు?...
అందరితోపాటు ఇంటి పన్నులు చెల్లిస్తున్నా...మాపై వివక్షత ఎందుకు?ప్రశ్నించిన శివారు కాలనీల మహిళలుఅధికారులకు ప్రజాప్రతినిథులకు అర్జీలు ఇచ్చి ఇచ్చి అలిసిపోయాంమున్సిపల్ కౌన్సిల్ భవనం ఎదుట ధర్నాపట్టణ పౌర సంక్షేమ సంఘం
నగరంలో అందరితోపాటు పెరిగిన ఇంటి పన్నులన్నీ వడ్డీతో సహా సక్రమంగా చెల్లిస్తు న్నా...మా కాలనీలపై పాలకులు,అధికారులు ఎందుకు వివక్షత చూపుతున్నారని శివారు కాలనీల మహిళల భార్గవి,జంగిల్ అమ్మ,శ్యామల,కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు రా మన్న,అనంత లక్ష్మన్న,దివాకర్,మాలన్న,పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరి గినేని పుల్లారెడ్డి ప్రశ్నించారు.సోమవారం పిపిఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ విలాస్,పార్థ సారథి నగర్,గీతాంజలి నగర్,రేణుక నగర్,రాధా నగర్,సత్యకీర్తి నగర్,రిచ్మండ్ కాలనీ, మల్లారెడ్డి వెంచర్స్ ప్రజలు నగరపాలక సంస్థ కౌన్సిల్ భవనం ఎదుట ఎస్.రమణ గౌడ్ అ ధ్యక్షతన ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 10ఏళ్లుగా పాలకులకు అధికా రులకు అర్జీలు ఇచ్చి ఇచ్చి అలిసిపోయామని కమిషనర్ దృష్టికి తెచ్చా రు.వర్షం వస్తే ఇంట్లో నుండి బయట అడుగు పెట్టె పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కొన్నిచోట్ల రోడ్లపై రోడ్లు వేస్తున్న ఫోటోలను కమిషనర్ కి ఇరిగినేని పుల్లారెడ్డి చూపెట్టాడు.ప్రజాధనం వృధా చేయడం మానుకొని రోడ్లు లేని శివారు కాలనీలను అభి వృద్ధి చేయాలని కోరారు.శివారు కాలనీల అసోసియన్ల ప్రతినిధులు కమిషనర్ కి అర్జీలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భోగేశ్వర్ రెడ్డి,సుబ్బారావు,నారాయణ,నాగేశ్వరరావు,సివి వ ర్మ,పీటర్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment