లేబర్ కోడ్స్ నీ తక్షణమే రద్దు చేయాలని 26న జరుగు ర్యాలీ,ధర్నాను జయప్రదం చేయండి...సిఐటియు...
లేబర్ కోడ్స్ నీ తక్షణమే రద్దు చేయాలని 26న జరుగు ర్యాలీ,ధర్నాను జయప్రదం చేయండిసిఐటియు
కర్నూలు నగరంలోని స్థానిక ఆర్ఎస్ రోడ్డు నుండి రైల్వే స్టేషన్ వరకు ఈ నెల 26న జరు గు నిరసన,ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు సి.హెచ్.సాయిబాబా, జిల్లా నాయకులు టి.రాముడు,నగర అధ్యక్షులు నగేష్,ఉపాధ్యక్షు లు సుధాకరప్పలు సోమవారం సమావేశమై కార్మికులు ఉద్యోగులకు పిలుపునిచ్చా రు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర కార్మిక,రైతు,వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కర్నూల్ నగరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వే స్టేషన్ ముం దు భారీ నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కో డ్స్ నవంబర్,21 నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వల్ల భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం 1926 సం..నుండి సా ధించుకున్న 29 చట్టాలు రద్దు అవుతాయని చెప్పారు.వీటివల్ల కార్మికులకు ఉన్న శక్తివం తమైన చట్టాలు బలహీనమై కార్మికులు ఉద్యోగులు యజమానుల దగ్గరగా బానిసలుగా ప నిచేయవలసి పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.ముఖ్యంగా సంఘం పెట్టుకునే హక్కు, పని గంటల భారం,కార్మికుడికి న్యాయంగా రావాల్సిన వాటికోసం యజమానుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండడం,సమ్మె చేసే హక్కు అరిచిపోవడం,కార్మి కులు సమ్మె చేస్తే నాయకులను జైలుకు పంపే తీవ్రమైన నేరాలు మోపడం పిఎఫ్ ఈఎస్ఐ ఇతర కార్మి కులు ఉద్యోగుల కున్న ఉద్యోగ భద్రత,రాయితీలు కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు ఎక్కువమందికి పరిశ్రమలు ఉం డడంవల్ల ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నారని ఆరోపించారు.కార్మికుల హక్కుల రక్షణ కో సం కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపునందుకొని కర్నూలు నగరం లోని కార్మికులు ఉద్యోగులు ఆర్ఎస్ రోడ్డు నుండి రైల్వే స్టేషన్ వరకు నవంబర్ 26వ తేదీ ఉదయం 10-00గంటలకు జరుగు నిరసన ర్యాలీ,రైల్వే స్టేషన్ ముందు జరిగే బారి ధర్నా ను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
Comments
Post a Comment