ఘనంగా బొల్లారంలో శ్రీశ్రీశ్రీ ఈశ్వరమ్మ అవ్వగారి 27వ ఆరాధన ఉత్సవం... ఎన్.రమణ రెడ్డి,ట్రస్ట్ చైర్మన్...
ఘనంగా బొల్లారంలో శ్రీశ్రీశ్రీ ఈశ్వరమ్మ అవ్వగారి27వ ఆరాధన ఉత్సవంఎన్.రమణ రెడ్డి,ట్రస్ట్ చైర్మన్
కల్లూరు మండలం,బొల్లవరం గ్రామంలో స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము మార్గశిర శుద్ధచవితి పురస్కరించుకొని సోమవారం శ్రీ ఈశ్వరమ్మ అవ్వ ట్రస్ట్ చైర్మన్ ఎన్.రమణ రె డ్డి ఆధ్వర్యంలో శ్రీ ఈశ్వరమ్మ అవ్వ ఆరాధన ఉత్సవం నిర్వహించారు.ఈ సందర్బంగా ఇందులో భాగంగా ఉదయం గం.8:00ల నుండి గణపతి ప్రార్థన,గురుప్రార్ధన,విశేష అభి షేకం,అర్చన నివేదన మహా మంగళ హారతి తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ప్రా రంభమయ్యాయి.
గం.8:30 నుండి బిందె సేవ,గం.9:30 ఆరాధన కార్యక్రమం,విశేష ద్రవ్యములతో అభి షేకం,అర్చన మంగళహారతి,తీర్థ ప్రసాదం జరిగింది.మధ్యాహ్నం గం.1:00 నుండి అన్న ప్రసాదం,సాయంత్రం గం 6:00 ప్రభోత్సవం,నందికోల సేవ జరిగింది.రాత్రి గం.9:00 "పంచమాంకం" ఉచిత నాటక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు.అదేవిదంగా అంతరాష్ట్ర స్థా యి న్యూ క్యాటగిరి విభాగం ఆధ్వర్యంలో ఉదయం గం.8-00 బండలాగుడు పోటీలు ఏ ర్పాటు చేశారు.
ఈ పోటీలలో గెలుపొందిన విజేతలు ప్రధమ బహుమతి నాగర్ కర్నూలు జిల్లా,లింగాల మండలం,రామవరం గ్రామం ఎం.అక్షర రెడ్డి,అనన్య రెడ్డిలు రూ. 50000,రెండవ బహు మతి అనంతపురం జిల్లా,ఎ.నారాయణ పురం గ్రామం,షేక్ మహమ్మద్ ఫరీద్ రూ.400 00,మూడవ బహుమతి నాగర్ కర్నూలు జిల్లా,లింగాల మండలం,రామవరం గ్రామం, ఎం.ధనుష్ రెడ్డి,రూ.30000,
నాల్గవ బహుమతి,సత్యసాయి జిల్లా,సికె మండలం,పూలేటిపల్లి గ్రామం,బిబిఆర్ బుల్స్ బ చ్చల బక్కర్ రెడ్డి రూ.20000,ఐదవ బహుమతి నంద్యాల జిల్లా,పాణ్యం మండలం,ఎస్ .కొత్తూరు గ్రామం,బీరం బుల్స్,వీరం శరవణ రెడ్డి రూ.10000,ఆరవ బహుమతి కర్నూ లు జిల్లా,కోడుమూరు మండలం,కొత్తపల్లి గ్రామం,కొత్తపల్లి దుబ్బన్న రూ.5000 ప్రకా రంగా దాతల చేతుల మీదుగా అందుకున్నారు.ఈ ఉత్సవంలో ట్రస్ట్ నాయకులు బొల్లవ రం పి.వి.రమణరెడ్డి,ఆయా రాష్ట్రాల నుండి భక్తులు,స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నా రు.
Comments
Post a Comment