బడా బాబుల స్విస్ ఖాతాలపై ఉక్కుపాదం... రూ.29వేల కోట్ల ఆస్తులు గుర్తింపు...
బడా బాబుల స్విస్ ఖాతాలపై ఉక్కుపాదంరూ.29వేల కోట్ల ఆస్తులు గుర్తింపువిదేశాల్లో రహస్య ఆస్తులు కూడబెట్టిన 24,678 మందిని గుర్తించిన ఐటీ శాఖవీరి ఆస్తుల విలువ రూ.29,208కోట్లుగా అంచనాఅంతర్జాతీయ ఒప్పందాలతో బడా బాబుల గుట్టురట్టుడిసెంబర్ వరకు ఐటీ శాఖ డెడ్లైన్తప్పితే 30 శాతం పన్ను...రూ.10లక్షల జరిమానా
VS9TV న్యూస్,హైదరాబాద్ :
విదేశాల్లో రహస్యంగా ఆస్తులు కూడబెట్టిన వారికి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఉచ్చు బిగి స్తోంది.స్విట్జర్లాండ్తో సహా పలుదేశాలతో కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందం (AE OI) ఆధారంగా విదేశాల్లో లెక్కచూపని ఆస్తులు కలిగిన 24,678 మందితో కూడిన జా బితాను ఐటీ శాఖ సిద్ధం చేసింది.వీరికి విదేశాల్లో సుమారు రూ.29,208కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ ఆస్తులతో పాటు వీరు దాదాపు రూ.1,089.88కోట్ల విదేశీ ఆదాయాన్ని కూడా తమ ఐటీ రిటర్న్లలో చూపలేదని అధి కారులు గుర్తించారు.విదేశాల నుంచి అందిన సమాచారాన్ని,2024-25 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి ఫైల్ చేసిన రిటర్న్లతో పోల్చి చూడటం ద్వారా ఈ బడాబాబుల గు ట్టు రట్టయింది.ఈ జాబితాలో పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉన్నతోద్యోగులు కూ డా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ లోగా సవరించిన ఐటీ రిట ర్న్లు దాఖలు చేయా లంటూ త్వరలోనే వీరందరికీ ఎస్ఎంఎ స్లు,ఈమెయిళ్ల ద్వారా ఐ టీ శాఖ హెచ్చ రికలు జారీ చేయనుంది.గడువులోగా స్పందించని వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.అటువంటి వారిపై 30శాతం పన్ను విధిం చడం తో పాటు చెల్లించాల్సిన పన్నుపై అదనంగా రూ.10లక్షల వరకు జరిమానా విధించే అవ కాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Comments
Post a Comment