మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై మరో దాడి...
మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై మరో దాడి
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్లపై ఈ మధ్య దాడులకు సంబంధించిన ఘటనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.మొన్న హకీంపేటలో బస్సు డ్రైవర్ పై దాడి,రాజన్న సిరి సి ల్ల జిల్లాలో కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఘటన మరువక ముందే వరంగల్ జిల్లాలో మరో దాడి జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి...వరంగల్ జిల్లా,న ర్సంపేట దగ్గర బస్సు ఎక్కిన మందుబాబులు డ్రైవర్ తో గొడవకు దిగారు.గేర్ బాక్స్ పైన కూర్చొని బూతు పురాణం మొదలుపెట్టారు.నర్సం పేట ఎమ్మెల్యే తన బంధువు అని చెప్పి మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పైదాడి చేశారు.అడ్డుకోబోయిన కండక్టర్ పై కూడా వారు దాడికి దిగారు.దీంతో డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు మందుబాబు ల దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసు లు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు.
Comments
Post a Comment