ట్రంపోన్మాదంపై అమెరికాలో నిరసనల వెల్లువ...పి.మధు,సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి...
ట్రంపోన్మాదంపై అమెరికాలో నిరసనల వెల్లువపి.మధు,సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరి స్తున్న తీరుపై సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి.మ ధు స్పందించారు.ఈ మేరకు తిరుపతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న అధిక టారిఫ్ల విధింపు (దిగుమతి పన్నులు) ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.చైనా,కెనడా,మె క్సికో వంటి దేశాల నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్ 10శాతం నుంచి 145శాతం వరకు పన్నులు విధించారు.ఇది వస్తువుల ధరలు పెరగడం,ఆదాయాలు,ఉద్యోగాలు తగ్గడం వం టి సమస్యలకు దారితీసింది.ఈ టారిఫ్లు విద్యా ఖర్చులు పెంచి,ఉద్యోగ అవ కాశాలను తగ్గించాయి.దీంతో విద్యార్థుల్లోనూ,యువకుల్లోనూ ఆర్థిక ఒత్తిడి పెరిగింది.ఈ టారిఫ్ల కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.ట్రంప్ అడ్డగోలు టారి ఫ్లు అమెరికన్ ఆర్థిక వ్యవస్థను 6-8శాతం తగ్గించాయి.జీడీపీ తగ్గడం,వేతనాలు 5-7శాతం తగ్గడం వంటివి జరిగాయి.మధ్యస్థ ఆదాయ కుటుంబాలు ప్రతి సంవత్సరం 1,2 00 నుంచి 5,200 డాలర్ల వరకు అదనపు ఖర్చులు భరించాల్సి వచ్చింది.యువతపై ఇది ప్రబలంగా పని చేసింది.
విద్యావ్యయం పెరిగింది :
కాలేజీల్లో ల్యాప్టాప్లు,బుక్స్,పెన్సిల్స్,పేపర్ వంటి సరఫరాలపై 10శాతానికి మించి ధ రలు పెరిగాయి.పాలిసాడెస్ స్కూల్ డిస్ట్రిక్ట్ (పెన్సిల్వేనియా) క్రోమ్ బుక్ల కొనుగోళ్లకు బడ్జె ట్ పెంచింది.కనీసం 10శాతం ఖర్చు అదనంగా పెరుగు తుందని అంచనా వేసింది.బ్యాక్-టు-స్కూలు ఖర్చులు 2024 కంటే 2025లో ఎక్కువ అయ్యాయి.గతేడాది కన్నా 70 శా తం అదనంగా ఖర్చు చేయాల్సివ స్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. టెక్నాలజీ మీద, దుస్తుల మీద 85శాతం ధరలు పెరిగాయి.ఉన్నత విద్య బడ్జెట్ పైనా ఒత్తిడి పెరిగింది.ఆ దాయ అసమాన తలు మరింత తీవ్రమవుతున్నాయి.
పెరుగుతున్న నిరుద్యోగం :
అమెరికాలోని 16-24 సంవత్సరాల యువత 10శాతం కంటే ఎక్కువగా ఉద్యోగావ కా శాలను కోల్పోతోంది.ఇది జాతీయ సగటు 4.2శాతం కంటే ఎక్కువ.2025లో ఆటో మేషన్,ట్రేడ్ వార్ వంటి కారణంగా కాలేజీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు 7.3శాతం తగ్గాయి.మధ్యస్థ ఆదాయ కుటుంబాలు 22వేల డాలర్ల నుంచి 58వేల డాలర్ల వరకూ జీ త నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి.స్టూడెంట్ డెట్,ఇన్ఫ్లేషన్,ఉద్యోగ మార్కెట్ అనిశ్చితి లాం టివి పెరిగాయి.విద్యాసంస్థల్లో ఆహారం,రవాణా,నిర్మాణ వ్యయాలు హెచ్చాయి.నిర్మాణం వ్యయం పెరిగి,గెట్టీస్బర్గ్ (పెన్సిల్వేనియా) స్టేడియం ప్రాజెక్టులు ఆగిపోయాయి.ఈ పరి ణామాలు యువతలో ఆందోళన పెంచు తున్నాయి.టారిఫ్లు పెంచడం,విద్యారంగ నిధు ల్లో కోత,విద్యార్థుల అరెస్టులు వంటివి విశ్వవిద్యాలయాల్లో నిరసనలకు దారితీశాయి.20 25లో 100 క్యాంపస్లలో (యూనివర్శిటీలు) పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.ట్రం ప్ టారిఫ్ల పెంపు తమ భవిష్యత్తును ధ్వంసం చేస్తుందని విద్యార్థులు గొంతెత్తారు. అమె రికా వ్యాప్తంగా వాషింగ్టన్తో సహా 50రాష్ట్రాల్లో 1300చోట్ల వేలాదిమంది విద్యార్థులు, యువతీ,యువకులు టారిఫ్ల విధింపు,నిధుల తగ్గింపుపై ఆందోళనలు చేపట్టారు.నిరస న కార్యక్రమాలు జరిపారు.బోస్టన్లో టఫ్ట్స్ యూనివర్సిటీ విద్యార్థి రూమేయ్సా ఓజ్ టర్క్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి.టారిఫ్లు ‘టారిఫైడ్’ (భయపెట్టే) అని ప్లకా ర్డులు ప్రదర్శించారు.ఇంకా అనేక సందర్భాల్లో విద్యార్థులు పెద్దఎత్తున తమ నిరసనలు తెల పటం కొనసాగుతూ ఉంది.ఏప్రిల్ 17న యాక్షన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేరుతో వం ద క్యాంపస్ల్లో వేలాది మంది విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేశారు.హార్వర్డ్లో విద్యార్థు లు,బోధనా సిబ్బంది ర్యాలీలు చేశారు.నవంబరు,7న 100 విశ్వ విద్యాలయ ప్రాంగణా ల్లో ట్రంప్ ప్రభుత్వం విధించిన ‘కాంపాక్ట్ ఫర్ అకడమిక్ ఎక్సెలెన్స్’కు వ్యతిరేకంగా నిరస నలు చేపట్టారు.ఫెడరల్ ఫండింగ్ కోసం కన్జర్వేటివ్ ఎజెండాను అమలు చేయవల్సిందిగా డిమాండ్ చేశారు.బ్రౌన్ యూనివర్సిటీలో హ్యాండ్ ప్రింట్ బ్యానర్లు ప్రదర్శించారు.న్యూ యార్క్లో యూనివర్సిటీ విద్యార్థులు నిధుల కోతకు వ్యతిరేకంగా గొంతెత్తారు.ఆక్టోబర్, 18న ‘నో కింగ్స్’పేరిట ఆందోళనలు జరిపారు.2026 మేడే సందర్భంగా స్టూడెంట్ స్ట్రై క్ చేయాలని నిర్ణయించారు.ఈ నిరసనలు అన్నింటా అధిక టారిఫ్లతో పాటు ఇమ్మిగ్రే షన్,భావప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాలను లేవనెత్తారు.స్టూడెంట్స్ రైజ్ అప్,ఎఎయుపి వంటి సంస్థలు ఈ ఆందోళనా కార్యక్రమాలను నడిపాయి.ట్రంప్ టారిఫ్లు తమపై భా రా న్ని పెంచి,ఉద్యోగావకాశాలను తగ్గించటాన్ని అమెరికా విద్యార్థులు,యువత తీవ్రంగా భా విస్తున్నారని చెప్పటానికి ఈ నిరసనల వెల్లువ నిదర్శనం.ఈ నిరసనలు అన్యాయానికి వ్య తిరేకంగా నిలబ డుతున్న యువశక్తి సత్తాను చూపించాయి.
Comments
Post a Comment