పెంచలయ్య హత్య కేసులో ఏడుగురు నింది తులు అరెస్ట్...ఘట్టమనేని శ్రీనివాసరావు, నెల్లూరు రూరల్ డీఎస్పీ...
పెంచలయ్య హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ఘట్టమనేని శ్రీనివాసరావు,నెల్లూరు రూరల్ డీఎస్పీ
నెల్లూరు జిల్లా,కల్లూరుపల్లిలో ఈ నెల 28న జరిగిన పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు కామాక్షమ్మ సహా మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ మేరకు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం...కె.పెంచలయ్య (38) ఆర్డి టీ కాలనీలో ఉండేవారు.సమాజ స్పృహతో వ్యవహరించే ఆయన..ఆర్డీటీ కాలనీలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఉండకూడదనే నిబంధన పెట్టారు.అరవ కామాక్షమ్మ తన అనుచరు లతో కలిసి స్థానికంగా నేర కార్యకలాపాలు కొనసాగిస్తుండేది.ఈ క్రమంలోనే పెంచల య్యపై కోపం పెంచుకున్న ఆమె అనుచరులు కత్తులతో అతడిని పొడిచి హతమార్చారు. ఈ ఘటన అనంతరం ఆమె ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.25 కిలోల గం జాయితో పాటు కొన్ని కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.ఈ కే సుకు సంబంధం ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుల వద్ద నుంచి ఏడు కత్తులు,మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో మొత్తం 14మంది నింది తులు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు.కామాక్షమ్మను గంజాయి కేసులో అరెస్టు చేసినట్లు తెలి పారు.మరోవైపు ఆమె సోదరుడు జేమ్స్ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్నాడు.పరారీలో ఉన్న ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డిఎస్పీ తెలిపారు.
Comments
Post a Comment