భర్తపై హత్యాయత్నం,భార్య,ప్రియుడు అరెస్ట్...
భర్తపై హత్యాయత్నం,భార్య,ప్రియుడు అరెస్ట్
చిత్తూరు జిల్లా,పలమనేరు మండలంలో భర్తను హత్య చేయడానికి యత్నించిన ఘటన లో భార్య శిల్పతో పాటు ఆమె ప్రియుడు ఎం.వెంకటేష్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం...ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సి.వెంకటేశులు భా ర్య శిల్పకు ఎం.వెంకటేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది.ఈ విషయం తెలిసి న భర్తపై ఆమె తన ప్రియుడితో కలిసి మే 16న వేడి నూనె పోసి హత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.హత్యాయత్నం అనంతరం ఇద్దరూ పరారయ్యారు.బాధితుడి ఫిర్యా దు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు,ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.ఎట్టకేలకు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు.పోలీసులు కేసు ను మరింత దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Post a Comment