యువతిపై సామూహిక అత్యాచారం...ఇద్దరు నిందితులు అరెస్ట్...
యువతిపై సామూహిక అత్యాచారం...ఇద్దరు నిందితులు అరెస్ట్
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో సంఘటన కలకలం రేపింది.స్థానిక మారుతి షోరూంలో పనిచేస్తున్న ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యా చారానికి పాల్పడ్డారు.బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం...విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలో నిందితులు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకుని మ ద్యం తాగించి మత్తులో అత్యాచారం చేశారు.అనంతరం ఆమెను వదిలేశారు.ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా,తక్షణమే పోలీసులు కేసు న మోదు చేసి దర్యా ప్తు చేపట్టారు.ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.బాధితురాలికి వైద్య పరీ క్షలు నిర్వహించి,అవసరమైన చికిత్స అందిస్తున్నారు.నిందితులపై చట్టప్రకారం కఠినచ ర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు ముగిసిన తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.
Comments
Post a Comment