గుండ్రేవుల జలాశయం కోసం ఐక్య పోరాటం... ఎం.శ్రీహర్ష,కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు...
గుండ్రేవుల జలాశయం కోసం ఐక్య పోరాటంసీమ సస్యశ్యామలం చేసుకునేందుకు గుండ్రేవులే మార్గం ఎం.శ్రీహర్ష,కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు
రాయలసీమకు జీవనాడి గుండ్రేవుల ప్రాజెక్ట్ సాధనలో అన్ని పార్టీలు,ప్రజా సంఘాలతో క లిసి ఐక్య పోరాటం చేస్తామని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహ ర్ష అన్నారు.సోమవారం రాజ్ విహార్ నుండి ధర్నా చౌక్ వరకు రైతులు,యువత, విద్యా ర్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ధర్నా చౌక్ వద్ద 48గంటల జల స మర దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ...కర్నూలు నగరానికి తాగు నీ రు,పశ్చిమ కర్నూలు రైతులకు సాగునీరు అందించగల శాశ్వత పరిష్కారంగా భావిస్తున్న గుండ్రేవుల ప్రాజెక్ట్ అత్యవసరతను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కేపియస్ ఈ దీక్షను ని ర్వహిస్తోందని పేర్కొన్నారు.గుండ్రేవుల ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ నీటి భద్రత, సా గునీటి స్థిరీకరణ,పరిశ్రమలకు నీటి లభ్యత,వర్షప్రమాద నియంత్రణ వంటి అంశాల్లో శాశ్వ త మార్పులు సంభ విస్తాయని,ప్రజలు,యువత,విద్యార్థులు,రైతు సంఘాలు కలిసి చేస్తు న్న ఈ ఉద్యమం ప్రాంత భవిష్యత్తు కోసం ప్రజా ఐక్యతకు పెద్ద నిదర్శనమని పేర్కొన్నారు.
ఉదయం రాజ్విహార్ ఆర్టీసీ పాత డిపో వద్ద రైతులు,యువత,విద్యార్థులతో భారీ ర్యాలీ ప్రారంభమై ధర్నా చౌక్కు చేరుకుంది.అక్కడ నిర్వహించిన సభలో నేతలు గుండ్రేవుల ప్రాజెక్ట్ అత్యవసరతపై ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం ఎం.శ్రీహర్ష 48గం టల జల సమర దీక్షకు కూర్చున్నారు.దీక్షకు మద్దతుగా సీఎల్పీఎం సెంట్రల్ జనరల్ సెక్రట రీ గఫూర్,జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ జి.పుల్లయ్య,కె.వి.సుబ్బారెడ్డి ఇంజనీ రింగ్ కాలేజ్,కర్నూలు ఇంటెలె క్చువల్ ఫోరం కన్వీనర్ మంసూర్,మాజీ కార్పొరేటర్ పు ల్లారెడ్డి,సీనియర్ అడ్వకేట్ హేమలత,ఆర్వీపీఎస్ రవి,విద్యార్థి నాయకుడు కోనేటి వెంక ట్,బీఎస్పీ నాయకుడు అరుణ్ కుమార్,నౌషాద్, సి.బెలగల్ నాయకుడు వెంకటేష్,రైతు సంఘం నాయకుడు పులకుర్తి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరై సంఘీభావం ప్రకటించా రు.అదేవిధంగా కాపు–బలిజా నాయకులు ఈశ్వర్,రవి,సాహదేవుడు కూడా దీక్షకు మద్ద తు తెలిపారు.కేపీయస్ సభ్యులు,సి.హెచ్,శ్రీనివాసులు,హరినాథ్ గౌడ్,డాక్టర్ మధు,రై తులు,యువత,విద్యార్థులు,వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment