భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య...
భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య
భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యా లలో చో టు చేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం...జిల్లా కేంద్రంలోని ఎస్ఐసీ కాలనీకి చెందిన మిట్టపల్లి ప్రియాంకకు,మందమర్రి మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ తో 2014లో వివాహం జరిగింది.అయితే కొంతకాలంగా ప్రియాంకను భర్త,అత్త,మామలు, మరిది వేధించేవారు.ఈనెల 9న ఆమెను కొట్టడంతో తల్లిగారింటికి వెళ్లింది.ఈ క్రమంలో నే ప్రియాంక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Post a Comment