ఎమ్మిగనూరు కోటేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలం పరిశీలన...కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డీఐజీ...
ఎమ్మిగనూరు కోటేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలం పరిశీలనకోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డీఐజీ
కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరు మండలం,కోటేకల్ సమీపంలోని కొండ వంక వద్ద రెండు కార్లు ఢీ కొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనా స్థలాన్ని శనివారం కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించారు.ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజి మీడియాతో మాట్లా డుతూ...రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు.టూరిస్ట్ భక్తులతో మంత్రాల యం వెళుతున్నకారు డ్రైవర్ నిద్రమత్తులో పూర్తిగా కుడి భాగం వైపు వచ్చేసి ఎదురుగా వ స్తున్న కారును క్రష్ చేయడం జరిగిందన్నారు.అకస్మాత్తుగా కారును రాంగ్ రూట్లో వెళ్ల నివ్వడంతో ప్రమాదం జరిగిందన్నారు.
ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు.అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా బెంగుళూరు నేషనల్ హైవేలలో రాత్రి పూట వాహనాల ను నిలిపి పోలీసులు డ్రైవర్లకు ఫేష్ వాష్ అండ్ గో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గేవిధంగా చేస్తున్నామన్నారు.కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు,ఎమ్మిగ నూరు సబ్ డివిజన్ ప్రాంతాలలో కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఫేష్ వాష్ అండ్ గో కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జాయిం ట్ కలెక్టర్ నూరుల్ కమర్,కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా,ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి,సిఐలు పాల్గొన్నారు.
Comments
Post a Comment