ఘనంగా భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలు...
ఘనంగా భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలు
విశ్వమానవాళికి "అమృత" తుల్యమైన ఆయుర్వేద శాస్త్రాన్ని అందించిన భగవాన్ శ్రీ ధ న్వంతరి జయంతి ఉత్స వాలలో భాగంగా బుధవారం ఆరోగ్య భారతి,కర్నూలు శాఖ ఆ ధ్వర్యంలో కల్లూరు,శ్రీ వాసవి కళ్యాణ మంటపంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం కుటుంబ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి కర్నూలు జిల్లా,ఆదోని నియోజక వ ర్గం శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి,ఆరోగ్య భారతి క్షేత్ర సంఘటనా కార్యదర్శి ఎ.కు మారస్వామిలు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆరోగ్యభారతి వార్షిక క్యాలెండర్ ను వా రిచే ఆవిష్కరించారు.
తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు,ఆరోగ్య భారతి జిల్లా అధ్యకులు,రిటైర్డ్ జి ల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ పి.మో క్షేశ్వరుడు పరిసుభ్రత,కాలుష్యంపై అవ గా హన కల్పించారు.కర్నూలు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ ప్రసంగిం చారు.జిల్లా ఉపాధ్యకులు,రిటైర్డ్ ఆయుర్వేదిక్ సీనియర్ మెడికల్ అధికారి,ఆయుష్ డిపార్ట్మెంట్,డా క్టర్ ద్వారం ప్రభాకర రెడ్డి మన ఆరోగ్యం గృహవైద్యం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా,నందికొట్కూరు అసెంబ్లీ బీజేపీ రాష్ట్ర సీనియర్ నా యకులు చల్లా దామోదరరెడ్డి 200మంది కుటుంబాలతో పట్టణ ప్రజలు,ఆరోగ్య భారతి కార్యకర్తలు పాల్గొనారు.
ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షులు డాక్టర్ యస్.వెంకటరమణ,రిటైర్డ్ ప్రొఫెసర్,కర్నూలు మెడికల్ కాలేజి,కర్నూలు ఆరోగ్య భారతి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎం.డి.వి.యన్.రామ శర్మ,ఆరోగ్యభారతి జిల్లా కార్యదర్శి బి.సత్యనారణరెడ్డి వార్షిక నివేదిక సమర్పించారు.క ర్నూలు నగర కార్యదర్శి యం.భరత్ కుమార్ రెడ్డి,నగర సంఘటనా కార్యదర్శి కుంపటి కృష్ణయ్య,ఆరోగ్య భారతి కార్యకర్తల సహకారంతో అందరికీ ఆరోగ్య భోజనం,చిరు ధాన్యాలు (మిల్లెట్స్)తో తయారు చేసిన పదార్ధాలతో భోజనవసతి కల్పించారు.
Comments
Post a Comment