పెంచలయ్యను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి...కర్నూలు జిల్లా డివైఎఫ్ ఐ అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్...
పెంచలయ్యను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలికర్నూలు జిల్లా డివైఎఫ్ ఐ అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్
కర్నూలు మండలం,ఉల్చాల గ్రామంలో గ్రామ కార్యదర్శి హరికిషన్ రెడ్డి అధ్యక్ష తన పెంచ లయ్య హత్యను ఖండిస్తూ డివైఎఫ్ఐ గ్రామా కమిటి అధ్వర్యంలో ధర్నా శనివారం కార్య క్రమం జరిగింది.ఈ సందర్బంగా ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా అధ్య క్షులు రాఘవేంద్ర మాట్లాడారు.రాష్ట్రంలో రోజు రోజుకు గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు పెరిగి పోతున్నాయని ఆందోళన వ్య క్తం చేశారు.డ్రగ్స్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన లీగల్ సెల్ విఫలం చెందిందన్నారు.గంజాయి మత్తు పదార్థాల ద్వారా యువత జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు.గంజాయి డ్రగ్స్ నివారణ కోసం పాట ద్వారా,మాట ద్వారా నిరంతరం ప్రజలను చైతన్యం చేస్తున్న డివైఎఫ్ఐ నాయకు డు,ప్రజా కళాకారుడు పెంచలయ్య హత్య బాధాకరమన్నారు.పెంచలయ్య మృతికి నివా ళి అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం మా టలకు ప్రచారాలకు పరిమితం కాకుండా వెంటనే పెంచలయ్యను హత్య చేసిన వారిని అరెస్టు చేసి,కఠీనంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పెంచలయ్య హత్య ను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలియజేశారు.అదేవిధంగా రాష్ట్రం లో డ్రగ్స్ నివారణ చేసి యువత భవిష్యత్తు కాపాడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్,ఎస్ఎఫ్ఐ జిల్లా సహా య కార్యదర్శి,డివైఎఫ్ఐ నాయకులు గోవర్ధన్,శ్రీనివాసులు,రవి,సురేష్,రాజు,మోహన్, తిమ్మరాజు, ఈశ్వరయ్య,మహేష్,కృష్ణ,నాగన్న,జావిద్,శివన్న,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment