తెలంగాణలో పెరుగుతున్న మద్యం దుకాణాలపై హైకోర్టు సీరియస్...
తెలంగాణలో పెరుగుతున్న మద్యం దుకాణాలపై హైకోర్టు సీరియస్ఇలాగే కొనసాగితే తెలంగాణ పేరు మార్చాల్సి వస్తుందిహైకోర్టు వ్యాఖ్యలు
తెలంగాణ హైకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.రాష్ట్రంలో ఇదే వేగంతో మద్యం దుకాణాల సంఖ్య పెరిగితే...త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించిం ది.అయితే రాష్ట్రంలో మద్యం వినియోగం,దుకాణాల సంఖ్య విషయంలో హైకోర్టు పాత్ర చాలా తక్కువ అని కోర్టు తెలిపింది.అసలింతకు కోర్టు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసింది అంటే...నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మ ధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా రు.మద్యం దుకాణాన్ని అక్కడి నుంచి తరలించాలని సూచించారు.కానీ వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు.దీంతో కాలనీ వాసులు ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు.తాజాగా ఈ పిటిషన్ని విచారించిన జస్టిస్ విజయ్సేన్ రెడ్డి ధర్మాసనం ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.రాష్ట్రంలో ఇలా ఇష్టానుసారంగా మద్యం దుకాణాలను పెంచు కుంటూపోతే...త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.అలానే రాష్ట్రంలో మద్యం షాపుల నియంత్రణ మీద తమకు పూర్తి అధికారాలు లేవని ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు తెలిపింది.అయినప్పటికీ ఈ అం శంలో తాము విధానపరమైన నిర్ణ యం తీసుకునే వరకు ఆదేశాలు జారీ చేయగలమని కోర్టు స్పష్టం చేసింది.ఇప్ప టికే రోడ్లపైకి మద్యం షాపులు కనిపించ కుండా ఏర్పాటు చే యాలని ఆదేశాలు జారీ చేసినా...ప్రభుత్వం వాటిని కనీసం పట్టించుకోవడం లేదని కో ర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇక నాగారం మున్సిపా లిటీలో జనావాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర మున్సిపల్,ఎక్సైజ్ అధికారులతో పాటు..షాపు ఏర్పాటు చేసిన వారికి కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చే సింది.
Comments
Post a Comment