ఏసీబీ వలలో రూ.100కోట్ల అవినీతి తిమింగలం...
ఏసీబీ వలలో రూ.100 కోట్ల అవినీతి తిమింగలం
రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీగా విధులు నిర్వహిస్తూ తప్పు డు సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములను ప్రైవేటుకు కట్టబెట్టి రూ.100కోట్ల ఆస్తులు దండు కున్నాడు.రంగారెడ్డి జిల్లాలో సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కొత్తమ్ శ్రీనివాసులు అనే వ్యక్తి,సంపాదనకు మించిన ఆస్తులు కూడ బె ట్టాడని ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు.దీంతో తన మై హోమ్ భూజ నివాసంతో పాటు అతని స్నేహితులు,బినామీల నివాసాలు,రంగారెడ్డి జిల్లా కలెక్టరే ట్లోని అతని కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టారు. త నిఖీల్లో మై హోమ్ భూజలో ఫ్లాట్,నారాయపేటలో రైస్ మిల్,అనంత పురంలో 11 ఎక రాలు,కర్ణాటకలో 11ఎకరాల భూములు,మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు ప్లాట్లు,నా రాయణ పేట లో ఒక రైస్ మిల్,నాలుగు ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అదేవిదంగా తన ఇంట్లో సోదాలు చేస్తుండగా 1.6కిలోల బంగారం,రూ.5 లక్షల నగ దు,770 గ్రాముల వెండి లభించినట్లు వెల్లడి చేశారు.గతంలో శ్రీనివాసులు మీద ఏసీబీ కే సు నమోదు అవ్వడంతో కొంత కాలం సస్పెన్షన్లో ఉండి తిరిగి విధుల్లో చేరారని,అ యినా తన పద్ధతి మార్చుకోలేదని ఏసీబీ అధికారులు తెలిపారు.
Comments
Post a Comment