కాటికి పోయే వయసులో ఇదేం పనిరా?మనుమరాలిపై తాత అఘాయిత్యం...20 సంవత్సరాలు కఠిన కారగార శిక్ష విధించిన కోర్టు...
కాటికి పోయే వయసులో ఇదేం పనిరా?
మనుమరాలిపై తాత అఘాయిత్యం
20 సంవత్సరాలు కఠిన కారగార శిక్ష విధించిన కోర్టు
విజయనగరం జిల్లా,గాజులరేగలో చోటు చేసుకున్న అమానుష ఘటనపై పోక్సో ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరిం చింది.తన సొంత మనవరాలిపై దారు ణంగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు బొండపల్లి సత్యారావు (59)కి 20 సంవ త్సరాల కఠిన కారాగార శిక్షను విధించిం ది.అంతేకాకుండా ఐదు వేల రూపాయలు జరిమానాను కూడా విధించింది.బాధిత బాలిక పునరావాసం కోసం ఐదు లక్షల పరిహారాన్ని ప్రకటించింది.విజయనగరం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆగ స్ట్,18,2025న వెలుగులోకి వచ్చింది.తన తాత సత్యారావు మృగంలా మారి చేసిన అఘాయిత్యం గురించి...బాలిక తెలిసి తెలియని మాటలతో తల్లికి తెలియ జే సింది.దీంతో వెంటనే నిందితునిపై బాలిక తల్లి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశా రు.మహిళా పోలీసు స్టేషన్ ఎస్ ఐ జి. శిరీష పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి,డిఎస్పీ ఆర్.గోవిందరావు పర్యవే క్షణలో దర్యాప్తు పూర్తి చేశారు.అనంత రం నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.కేసుకు సంబంధించి కోర్టులో ఫోక్సో న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖజానా రావు బలమైన వాదనలు వినిపించడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం.ఈ తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా బాలలపై జరిగే నేరాలకు కఠిన హెచ్చరికగా నిలుస్తుందని అన్నారు.జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్.అయితే భవిష్య త్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని తెలియజే శారు.నిందితులపై చర్యలు తీసుకోవడ మే కాకుండా చిన్నారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
Comments
Post a Comment