గోవా నైట్క్లబ్లో ఘోర అగ్నిప్రమాదం... 23మంది మృతి...
గోవా నైట్క్లబ్లో ఘోర అగ్నిప్రమాదం... 23మంది మృతిసిలిండర్ పేలడంతో దుర్ఘటనమృతుల్లో నలుగురు పర్యాటకులు,క్లబ్ సిబ్బందిభద్రతా లోపాలే కారణమని అనుమానం
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉ న్న ఓ నైట్క్లబ్లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పో యారు.వంటగదిలో సిలిండర్ పేలడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘బర్చ్ బై రోమియో లేన్’ అనే నైట్క్లబ్లో ఈ ప్రమాదం జరిగింది.మృతుల్లో నలుగురు పర్యాటకు లు ఉండగా,మిగిలిన వారంతా క్లబ్ సిబ్బంది అని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపా రు.మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.ముగ్గురు వ్యక్తులు మంటల్లో సజీవద హనం కాగా,20మంది పొగకు ఊపిరాడక చనిపోయారని పోలీసులు వెల్లడించారు.ప్ర మాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్,స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.ఈ దుర్ఘటన పై సీఎం తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Post a Comment