డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 27మందికి జరిమానా...మన్సూరుద్దిన్,కర్నూలు ట్రాఫిక్ సిఐ...
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 27మందికి జరిమానా
మన్సూరుద్దిన్,కర్నూలు ట్రాఫిక్ సిఐ
కర్నూలు నగరం,ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికీ జెఎఫ్ సిఎం కోర్ట్ జరిమానా విధించినట్లు కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దిన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు,కర్నూలు డిఎస్పి బాబు ప్రసాద్ ఉత్తర్వులు మేరకు కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దిన్ ఆధ్వ ర్యంలో కర్నూలు ట్రాఫిక్ సిబ్బంది ప్రతి ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది.ఈ నేపథ్యంలో
డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడినవారిపై కేసులు నమోదు చేసి,కోర్టులో హజరు పరిచారు.పట్టుబడిన 27మందికి కర్నూ లు జెఎఫ్ సిఎం కోర్టు వారు ఒక్కొక్కరికి రూ.10వేలు ప్రకారంగా,మొత్తం రూ.2.70లక్షలు జరిమానా విధించిన్నట్లు కర్నూలు ట్రాఫిక్ సిఐ ఎస్ మన్సూరుద్దీన్ తెలిపారు.
Comments
Post a Comment