రాష్ట్రవ్యాప్తంగా 415 సర్పంచ్ లు, 8,304, వార్డు సభ్యులు ఏకగ్రీవం...
రాష్ట్రవ్యాప్తంగా 415 సర్పంచ్ లు, 8,304, వార్డు సభ్యులు ఏకగ్రీవం
తెలంగాణలో రెండో విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహి స్తుం డగా 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవ మయ్యాయి.పలు కారణాలతో ఐదు సర్పంచ్ స్థా నాలు నామినేషన్లు దాఖలు కాలేదు.మిగిలిన 3,911సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగ నుండగా 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 415 మంది సర్పంచ్ అభ్యర్థులు,8,304 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అధికారికం గా ప్రకటించింది.జిల్లాల వారీగా పరిశీలిస్తే,కా మారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా,నల్గొం డ,నిజామా బాద్ జిల్లాల్లో చెరో 38స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.రెండో విడతలో భాగంగా 4,332 గ్రామ పంచాయతీలకు,38,322వార్డులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చే సింది.నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి సర్పంచ్ బరి నుంచి 7,5 84 మంది,వార్డు సభ్యుల బరి నుంచి 10,427మంది తమ నామినేషన్లను ఉపసంహ రించుకున్నారు.ఇప్పటి వరకు జరిగిన రెండు విడతలను కలిపి చూస్తే,రాష్ట్రవ్యాప్తంగా మొ త్తం 810మంది సర్పంచ్లు,17,635మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎ న్నికల సంఘం ప్రకటనలో స్పష్టం చేసింది.మిగిలిన స్థానాలకు త్వరలోనే పోలింగ్ జరగ నుంది.
Comments
Post a Comment