ఆత్మహత్యల ట్రాప్...జాగో తెలంగాణ బీసీ యువత...

ఆత్మహత్యల ట్రాప్-జాగో తెలంగాణ బీసీ యువత

VS9TV న్యూస్,హైదరాబాద్ :
రాజకీయం ఎంత మందిని అయినా బలి తీసుకుని తాము గెలవాలనుకుంటుంది.మీరు చ చ్చిపోవద్దు..మేమే చచ్చిపో తామని నేతలు డైలాగులు చెబుతారు.అలాంటి మాటలతో మ రింతగా ఉద్రేకపడే వారు ఆత్మహత్యలు చేసుకుంటారు.ఇప్పుడు మరోసారి తెలంగాణ యువతపై ఆత్మహత్య ట్రాప్ విసురుతోంది రాజకీ యం.బీసీ యువతను టార్గెట్ చేస్తోం ది.ఇలాంటి వారి ట్రాప్‌లో పడితే భవిష్యత్ అంధకారం అవుతుంది.
బీసీ రిజర్వేషన్ల కోసం యువకుడి ఆత్మహత్య
క్యూ కట్టిన రాజకీయ నేతలు
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం సాయి ఈశ్వర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం ప్రారంభమయింది.ఆత్మహత్య చేసుకుంటే రిజర్వేషన్లు వస్తాయ ని సాయి ఈశ్వర్ కు ఎవరు చెబుతారు? కానీ ఆయన కోసం రాజకీయ నేతలు వాలిపో వడం ప్రారంభించారు.సాయి ఈశ్వర్ భౌతిక ఖాయానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు.కేటీఆర్ ట్విట్టర్ లో ఖండిం చారు.ఇతర పా ర్టీల వారు వస్తారు.అందరూ ఒకటే చెబుతారు.మీరెవరూ చనిపోవద్దు..దాని కోసం మే మున్నామని చెబుతారు.కానీ వారి మాటలు ఎలా ఉంటాయో...అవి యువతలోకి ఎలా వెళ్తాయో చెప్పాల్సిన పని లేదు.
తెలంగాణ ఉద్యమం సమయంలో వందల మంది బలిదానాలు :
తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకు న్నారు.వారిలో అత్యధికులు బడుగులు,బలహీనవర్గాలవారే.ఆత్మహత్యలు చేసుకుంటే తె లంగాణ ఉద్యమం బలపడుతుందన్న సంకేతాలను ఇచ్చిన వారు ఎవరో అందరికీ తెలుసు. ఇప్పుడు వారంతా పదవులు అనుభవించారు.అనుభవిస్తున్నారు.కానీ ఆ కుటుంబాలు మా త్రం తమ బిడ్డల్ని పోగొట్టుకున్న కుటుంబాలు మాత్రం కుమిలిపోతున్నాయి.చివరికి తెలం గాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన వారికి న్యాయం జరగలేదని కవిత కూడా చెప్పారు. ఆమెకు కష్టం వచ్చి బయటకు వచ్చిన తరవాతనే చెప్పారు కానీ...అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ గుర్తుకు రాలేదు.రాజకీయం అంటే అలాగే ఉంటుంది.
ఇప్పుడు బీసీ యువతపై అదే ట్రాప్ :
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది పొలిటికల్ అస్త్రం.దాంతో బీసీల ఓట్లు పొందడా నికి రాజకీయ పార్టీలు ఎవరికి మించిన డ్రామాలు వారు వేస్తారు.అవి సాధ్యమవుతాయా లేదా అన్నది ఎవరికీ తెలియదు.ఇప్పుడు ఉన్న రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదు.ఒక వే ళ ఆ రిజర్వేషన్లు వచ్చినా బీసీలంతా బాగుపడిపోతారని ఎవరూ అనుకోలేరు.70 ఏళ్లుగా రిజర్వేషన్లు ఉన్న వర్గాలేమీ బాగుపడలేదు.కొంత మంది బాగుపడ్డారు.అయినా ప్రాణాలు వదిలేస్తే...రిజర్వేషన్లు వస్తాయని అనుకోడం...ఆ దిశగా యువతను రెచ్చగొట్టి రాజకీ యం చేయాలనుకోవడం అత్యంత ఘోరమైన రాజకీయం.
రాజకీయ నేతలు కాస్త ఆలోచించండి
అర్థం పర్థం లేని కారణాలతో ఆత్మహ త్యలు చేసుకుని పరామర్శించి,ఇంకా రెచ్చగొట్టే ప్ర కటనలు చేయడం వల్ల మరికొంత మంది ఆవేశపడి ప్రాణాలు వదిలితే ఆ పాపం ఊరకనే పోదు.కొన్ని వందల కుటుంబాలు ఇప్పటికీ వేదన పడుతున్నాయి.ఇప్పుడు మరోసారి బీ సీ యువతను ఈ ట్రాప్ లోకి లాగాలని ప్రయత్నించడం బీసీ బిడ్డలపై కుట్ర చేయడమే.అ లాంటి పనులు చేయడం కన్నా రాజకీయాలను వదిలేయడం శ్రేయస్కరం అని ప్రజలు హితవు పలుకుతున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...