తమిళనాడులో దారుణం...వేట కొడవళ్ళతో వలస కార్మికుడిపై దాడి...
తమిళనాడులో దారుణంవేట కొడవళ్ళతో వలస కార్మికుడిపై దాడిఘటనను సెల్ ఫోన్ లో రికార్డ్సోషల్ మీడియాలో హల్ చల్
తమిళనాడు,తిరువళ్లూరు జిల్లాలో ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వ చ్చింది. మధ్యప్రదేశ్ కు చెందిన సిరాజ్ అనే వలస కార్మికుడిపై నలుగురు బాలురు కత్తులు వేటకొ డవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు.ఈ అమానవీయ ఘటనను నిందితులు త మ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయడం,ఆ వీడియో సోషల్ మీడి యాలో వైరల్ కావడంతో స్థానికంగా తీవ్రకలకలం రేగింది.వివరాలు ఇలా ఉన్నాయి....రైలు ప్రయాణంలో ఉన్న ప్పుడు మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది.కదులుతున్న రైలులో నే నిందితులు సిరాజు ఆయుధాలతో బెదిరిస్తూ భయపెట్టారు.ఆ తర్వాత అత డిని రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వేటకొడవళ్లతో దారుణంగా న రికారు.ఈ దాడి చేస్తున్న సమయంలో ఒక నిందితుడు ఏమా త్రం భయం లేకుండా కెమె రా వైపు విక్టరీ సింబల్ చూపించడం వారి ఉన్మాదానికి పరాకాష్ఠగా నిలిచింది.
రీల్స్ కోసం ఉన్మాదం :
నిందితులు ఈ ఘోరమైన దాడిని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు.సోషల్ మీడియా లో (ముఖ్యంగా ఇన్స్టామ్ రీల్స్ కోసం) వైరల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్ప డినట్లు పోలీసులు గుర్తించారు.దాడి తర్వాత నిందితులు 'విక్టరీ' (విజయం) చిహ్నాన్ని చూపిస్తూ వికృతానందం పొందారు.
బాధితుడి పరిస్థితి :
బాధితుడు సిరాజ్ మధ్యప్రదేశ్ (కొన్ని నివేదికల ప్రకారం మహారాష్ట్ర లేదా ఒడిశా) రాష్ట్రా నికి చెందిన వలస కార్మికుడు.ఈ దాడిలో అతడి తల,ముఖం,చేతులపై తీవ్రమైన గాయా లయ్యాయి.ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసుల చర్య :
వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు చేప ట్టిన పోలీసులు,17ఏళ్ల వయస్సు గల నలుగు రు మైనర్లను అదుపులోకి తీసుకు న్నారు.నిందితులు గంజాయి లేదా మద్యం మత్తులో ఉ న్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రాజకీయ స్పందన :
ఈ ఘటన తమిళనాడులో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర చర్చకు దారి తీసింది.ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని విమర్శించాయి.
Comments
Post a Comment