బెల్ట్‌షాపులపై భగ్గుమన్న మహిళలు... అక్రమంగా దాచిన మద్యం సీసాలను వీధిలోకి తీసుకొచ్చి దహనం...ఇకపై మద్యం అమ్మితే ‘ఖబడ్దార్‌’ అంటూ హెచ్చరిక...

బెల్ట్‌షాపులపై భగ్గుమన్న మహిళలు
అక్రమంగా దాచిన మద్యం సీసాలను వీధిలోకి తీసుకొచ్చి దహనం
ఇకపై మద్యం అమ్మితే ‘ఖబడ్దార్‌’ అంటూ హెచ్చరిక
VS9TV న్యూస్,బాపట్ల :
బాపట్ల జిల్లా,పంగులూరులో బెల్ట్‌ షాపు లకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమిం చారు.ర్యాలీగా వెళ్లి బాపట్ల జిల్లా, పంగు లూరు మండలం,కోటపాడు గ్రామంలోని బెల్ట్‌ షాపులపై దాడి చేశారు.అక్రమంగా దాచిన మద్యం సీసాలను బయటకు తీసుకొచ్చి వీధిలో తగలబెట్టారు.ఇకనుం చి మద్యం అమ్మితే ఊరుకునేది లేదని నిర్వాహకులను హెచ్చరిక చేశారు.మ ద్యం వల్ల మా కుటుంబాలు నాశనమ వుతున్నాయని,కుటుంబాల్లో కలహాలు చెలరేగి భార్యాభర్తలు విడిపోతున్నారని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆ వేదన వ్యక్తం చేశారు.ఎవరైనా బెల్ట్‌ షాపు లు నిర్వహిస్తే తమ తడాఖా చూపిస్తా మని మహిళలు హెచ్చరించారు.వీరికి గ్రామస్తులంతా వీధిలోకి వచ్చి మద్దతు తెలిపారు.మద్యం షాపులను నిర్వాహకు లను కట్టడి చేయండి అంటూ ప్రోత్సహిం చారు.ఈ నేపథ్యంలో ఐద్వా అఖిల భారత నాయకు రాలు డి.రమాదేవి ఆధ్వ ర్యంలో కోటపాడు గ్రామంలోని దళిత కాలనీలో మహిళలతో సమావేశ మయ్యా రు.ఈ సందర్భంగా మహిళలు మాట్లా డుతూ మా గ్రామంలో ఏడు బెల్ట్‌ షాపులు నడుస్తున్నాయని,మద్యం వల్ల మా కుటుంబాలు సర్వనాశనమవు తున్నాయని తెలిపారు.మా గ్రామంలో మద్యం అమ్మడానికి వీల్లేదని, ఇందు కోసం ఏ పోరాటానికైనా సిద్ధమేనని చెప్పారు.అనంతరం మహిళలంతా బెల్ట్‌ షాపులపై దాడికి కదిలారు.తొలుత దళిత కాలనీ పక్కనే ఉన్న బత్తుల కొండలు బెల్ట్‌ షాపుపై దాడి చేశారు.మద్యం సీసాల కోసం వెతికారు.ముందుగానే సమాచారం అందుకున్న కొండలు వాటిని వేరేచోటకు పంపాడని తెలుసుకొని మహిళలు అక్క డి నుండి ఇరగని గోవిందమ్మ బెల్ట్‌ షాపు వద్దకు వెళ్లారు.ఆమెతో మాట్లాడారు. పంగులూరు,ముప్పవరం బ్రాందీ షాపుల నుండి మద్యం బాటిళ్లు తీసుకొస్తున్నా నని,రోజుకు పది క్వార్టర్ల మద్యం అమ్ము తున్నానని,రూ.400 ఆదాయం వస్తోం దని గోవిందరమ్మ చెప్పారు.ఇక నుండి మద్యం అమ్మితే ఊరుకోబోమని మహిళ లు హెచ్చరించారు.ఆ తర్వాత గ్రంధి రామారావు,గ్రంధి మహాలక్ష్మి బెల్ట్‌ షాపు లపై దాడి చేశారు.ఈ సందర్భంగా బెల్ట్‌ షాపు నిర్వాహకులకు,వారికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.మహిళలు వారి ఇంట్లోకి వెళ్లి దాచిపెట్టిన మద్యం సీసాలను,గ్లాసులను,కాళీ మద్యం సీసా లను బయటకు తీసుకొచ్చి దగ్ధం చేశా రు.ఈ సందర్భంగా రమాదేవి మాట్లా డుతూ మద్యం వల్ల అనేక కుటుంబాలు సర్వనాశనమవుతున్నా ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని మద్యం అమ్మకా లను ప్రోత్సహిస్తోందని,మద్యం షాపుల్లో ఎమ్మెల్యేలకు కూడా వాటాలు ఉన్నాయ ని అన్నారు.రోజంతా కష్టపడి సంపాదిం చిన డబ్బులను కొందరు మద్యానికి ఖర్చు పెడుతున్నారని,అటువంటి వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నా యని తెలిపారు.గంజాయిని నిలువరిం చేందుకు నెల్లూరు జిల్లాలో పోరాడుతున్న పెంచలయ్యను గంజాయి ముఠా దారు ణంగా హత్య చేసిందని,దానిపై ఇంతవ రకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకో లేదని అన్నారు.మద్యానికి,బెల్ట్‌ షాపు లకు వ్యతిరేకంగా మహిళలంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.సిపిఎం మండ ల కార్యదర్శి తలపనేని రామారావు, సభ్యుడు గుడిపాటి మల్లారెడ్డి మాట్లా డుతూ గతంలో ఇక్కడ బెల్ట్‌ షాపులకు వ్యతిరేకంగా మహిళలు పోరాడారని, మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.అనంతరం మహిళలు ‘బెల్ట్‌ షాపులను నివారించాలి,బెల్టు షాప్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి, మా ఊరికి మద్యం వద్దు,గంజాయి గుండాల దాడికి బలైన పెంచలయ్యకు జోహార్‌’ అంటూ నినాదాలు చేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....