రేషన్ సరుకులను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి...జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి...
రేషన్ సరుకులను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి65 ఏళ్లు పైబడిన వృద్ధులు,దివ్యాంగులకుఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులను అందచేయాలిజిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
VS9TV న్యూన్,కర్నూలు కలెక్టరేట్ :
రేషన్ షాపుల ద్వారా సరుకులను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు.మంగళవారం హెూళ గుంద మండల కేంద్రంలో ప్రభుత్వ చౌకధరల దుకాణం-03ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశా రు.ఈ సందర్భంగా కలెక్టర్ ఎ.సిరి రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ,స్టాక్ వివరాలు,ఈ పా స్ యంత్రాల వినియోగం,కార్డుదారులు హాజరు నమోదు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
అర్హులైన ప్రతి కార్డుదారుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో నాణ్యమైన ని త్యావసర సరుకులు అందించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచిం చారు.రేషన్ దుకాణాల్లో పారదర్శకతను పాటిస్తూ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పంపిణీ జరగాలని డీలర్ ను ఆదేశించారు.అనంతరం 65 సంవత్సరాలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న హెూమ్ డెలివరీ ప్రక్రియను పరిశీలించారు.ప్రతి నెల నిర్దేశించిన తేదీల్లో వృద్ధులు,దివ్యాంగులకు హెూమ్ డెలివరీ ప్రక్రియను వంద శా తం అధికారులు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.అనంతరం కలెక్టర్ 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు బసమ్మ,మీనాక్షమ్మలకు ఇంటి వద్దకే వెళ్లి రే షన్ సరుకులు అందచేశారు.ప్రభుత్వం అందజేస్తున్న సేవలు గురించి వారిని అడిగి తెలు సుకున్నారు.ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి రాజా రఘువీర్,ఆదో ని సబ్ కలెక్టర్ (ఇంచార్జి) అజయ్ కుమార్,తహసీల్దార్ నిజాముద్దీన్ తదితరులు పాల్గొ న్నారు.


Comments
Post a Comment