ట్రెడిషనల్ విలువిద్యలో సత్తా చాటిన ఎపి క్రీడాకారులు...రాష్ట్రానికి ఏడు బంగారు,ఆరు సిల్వర్ పథకాలు...అభినందించిన రాష్ట్ర ప్రజలు...
ట్రెడిషనల్ విలువిద్యలో సత్తా చాటిన ఎపి క్రీడాకారులురాష్ట్రానికి ఏడు బంగారు,ఆరు సిల్వర్ పథకాలుఅభినందించిన రాష్ట్ర ప్రజలు
ట్రెడిషనల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ట్రెడిషనల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 27,28,29వ తేదీల్లో హైదరాబాద్,ఖైరతాబాద్,ప్రభు త్వం డిగ్రీ కళాశాలలో 5వ ట్రెడిషనల్ అర్చరీ పోటీలు నిర్వహించారు.పోటీలకు ట్రెడిషనల్ అర్చరీ ఫెడరే షన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ మద న్ కుమార్ హాజరయ్యారు.ఈ సం దర్బంగా ఆయన మాట్లాడుతూ పోటీలలో ఐదు రాష్ట్రాల క్రీడాకారుల నుండి పాల్గొన్నట్లు చెప్పారు.కోచ్ ఎన్.వజ్రరాజు మాట్లాడుతూ ట్రెడిషన ల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి 30మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు.
క్రీడాకారులకు కర్నూలు నగరంలోని ఆదర్శ విద్యామందిర్ హైస్కూల్ నందు శిక్షణ ఇవ్వ డం జరిగిందని పేర్కొన్నారు.పోటీలలో ఆంధ్రప్రదేశ్ క్రీడా కారులకు ఏడు బంగారు పథ కాలు,ఆరు సిల్వర్ పథకాలు,10 కాంస్య పథకాలు సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ ర్వకారణం అని ఆయన కొనియాడారు.గెలుపొందిన క్రీడాకారులను తల్లి,తండ్రులు,రాష్ట్ర ప్రజలు అభినందించారు.
Comments
Post a Comment