దైర్యంగా దొంగను పట్టుకున్న యువతి...
దైర్యంగా దొంగను పట్టుకున్న యువతి
కేరళ,అలప్పుజకు చెందిన దివ్య అనే బాలిక ఢిల్లీలోని కేరళ స్కూల్లో 9వ తరగతి చదు వుతోంది.రాత్రి సమయంలో ట్యూషన్ ముగించుకుని తన తల్లితో కలిసి ఇంటికి వెళ్తుం డగా,ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి ఆమె తల్లిని కిందకు తోసేసి,మెడలోని గొలుసును లా క్కొని పారిపోయాడు.తల్లి కింద పడిపోవడాన్ని చూసిన దివ్య ఏమాత్రం భయపడ కుం డా దొంగను వెంబడించింది.
రద్దీగా ఉన్న రోడ్డుపై దాదాపు అర కిలోమీటరు దూరం పరుగెత్తి అతడిని దైర్యంగా పట్టు కుంది.గత ఐదేళ్లుగా కరాటే నేర్చుకుంటున్న దివ్య,తన నైపుణ్యంతో దొంగను లొంగదీసి కిందకు పడవేసింది.అనంతరం స్థానికుల సహాయంతో అతడిని పోలీసులకు అప్పగిం చారు.గొలుసు కంటే కూడా,మా అమ్మను కిందకు తోసేయడం చూసినప్పుడు నాకు కలి గిన ఆగ్రహమే నన్ను అతడిని పట్టుకునేలా చేసింది అని దివ్య పేర్కొంది.ఆపత్కాలంలో అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య ఎంత అవసరమో ఈ సంఘటన మరోసారి నిరూపిం చింది.దివ్య చూపిన సాహసాన్ని కచ్చితంగా అభినందించాలి.


Comments
Post a Comment