నటి మాధవీలతపై కేసు నమోదు...
నటి మాధవీలతపై కేసు నమోదు
ప్రముఖ సినీనటి మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది.ఆమెపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.సోషల్ మీడియాలో సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్రచారా లు,వ్యాప్తి చేసినందుకు మాధవీలతపై కేసు నమోదు చేశారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...నటి మాధవీలతతోపాటు,ఈ ప్రచారానికి పాల్పడిన పలువురు యూట్యూబ ర్లు,సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కూడా ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.వా రు పెట్టిన పోస్టు వల్ల ప్రజల భావోద్వేగాలకు నష్టం జరిగిందని ఎఫ్ఐఆర్లో ప్రస్తావించా రు.మంగళవారం ఉదయం 10-00 గంటలకు మాధవీలతతో పాటు మిగతా యూ ట్యూ బర్లు,సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని తెలిపారు.ఎఫ్ ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ కేసులోని ఇ తర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.ఈక్రమంలో వారి సోషల్ మీడియా ఖాతా లపై నిఘా పెట్టినట్లు సమాచారం.సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్య లు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Comments
Post a Comment