మహారాష్ట్రలో...విచిత్ర ఘటన...పురుషుడిపై మహిళ అత్యాచారం...
మహారాష్ట్రలో...విచిత్ర ఘటనఅయ్యో రాములా...ఎంత ఘోరంపురుషుడిపై మహిళ అత్యాచారంఆపై బెదిరింపు...కేసుపెట్టిన బాధితుడు
మహారాష్ట్రలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ పురుషుడికి మత్తుమందు ఇచ్చి అ త్యాచారానికి పాల్పడటమే కాకుండా,తనను పెళ్లి చేసుకోకుంటే రేప్ కేసు పెడతానం టూ ఓ మహిళ బెదిరించిన ఘటన పూణెలోని కోత్రుడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ముంధ్వా ప్రాంతానికి చెం దిన 37ఏళ్ల వ్యక్తికి,కోత్రుడ్కు చెందిన 38ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది.తాను హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నానని ఆమె నమ్మబలికింది.బాధితుడిపై అతని భా ర్య పెట్టిన కేసులో న్యాయసహాయం చేస్తానని చెప్పి అతనికి దగ్గరైంది.ఈ క్రమంలో,అత నికి మత్తుమందు ఇచ్చి వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్లి మూడుసార్లు అత్యాచారం చేసినట్లు బాధితుడు తన ఫిర్యాదులో ఆరోపించాడు.ఆ తర్వాత,నిందితురాలు తనను వివాహం చే సుకోవాలని బాధితుడిపై ఒత్తిడి తెచ్చింది.అతను అందుకు నిరాకరించడంతో, "నన్ను పె ళ్లి చేసుకో,లేదా రూ.2 లక్షలు ఇవ్వు.లేకపోతే నీపై అత్యాచారం కేసు పెట్టి జైలుకు పంపి స్తాను" అని బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Post a Comment