నూతన జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి...
నూతన జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డును ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ (APJF) ప్రతినిధులు సోమవారం ముఖ్య మంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడును కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా 2026–27 సంవత్సరానికి సంబంధించిన మీడియా అక్రిడిటేషన్లు నూతన జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా మం జూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.ప్రస్తుతం మీడియా అక్రిడిటేషన్ వెబ్ పోర్ట ల్లో అనేక సాంకేతిక సమస్యలు ఎదుర వుతున్నట్లు తెలియజేశారు.దీని వల్ల జర్నలిస్టు లకు అప్లికేషన్ ప్రక్రియలో సమస్యలు తలెత్తుతున్నాయని విన్నవించారు.సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే వెబ్ పోర్టల్ లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శివ రాజేష్,ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల రాష్ట్ర అధ్యక్షులు ఎం.అనిల్,సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్,సీని యర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
Comments
Post a Comment