భారత జీడీపీ కంటే...ఇళ్లలో బంగారం విలువే అధికం...ప్ర‌జ‌ల వ‌ద్ద‌ లక్ష‌ల కోట్ల ప‌సిడి నిల్వ‌లు...

భారత జీడీపీ కంటే...ఇళ్లలో బంగారం విలువే అధికం
ప్ర‌జ‌ల వ‌ద్ద‌ లక్ష‌ల కోట్ల ప‌సిడి నిల్వ‌లు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ మరో సంచలనానికి దారితీసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో భారతీయ కు టుంబాల వద్ద ఉన్న బంగారం మొత్తం విలువ దేశ ఆర్థిక వ్యవస్థ (జీడీ పీ) పరిమాణాన్ని మించిపోయింది.అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,500 డా లర్లు దాటడంతో ఈ పరిస్థితి నెలకొంది.మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం...భారతీయ ఇళ్లలో దాదా పు 34,600 టన్నుల బంగారం నిల్వఉంది.ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకా రం లెక్కగడితే...భారతీయుల వద్ద ఉన్న ఈ బంగారం విలువ ఐదు లక్షల కోట్ల డాలర్ల కంటే ఎక్కువ.అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం భారత జీడీపీ సు మారు 4.1లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.అంటే దేశం మొత్తం ఉత్పత్తి చేసే ఆదాయం కం టే ప్రజల ఇళ్లలో ఉన్న పసిడి విలువే ఎక్కువగా ఉండటం గమనార్హం.ఈ అంశంపై ఇ న్ఫోమెరిక్స్ వాల్యుయేషన్ అండ్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ డాక్టర్ మనోరంజన్ శర్మ ఎక నామిక్ టైమ్స్‌తో మాట్లాడుతూ..."జీడీపీ అనేది ఒక ప్రవాహం లాంటిది,బంగారం అనేది నిల్వ ఉండే ఆస్తి.ఈ రెండింటిని నేరుగా పోల్చలేం.కానీ,భారత ఆర్థిక వ్యవస్థలో బంగా రా నికి ఉన్న సామాజిక,ఆర్థిక,మానసిక ప్రాధాన్యతను ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తు న్నాయి" అని విశ్లేషించారు.
సంపద పెరుగుతుందా ? :
బంగారం విలువ పెరగడం వల్ల గృహాల బ్యాలెన్స్ షీట్లు బలపడతాయని మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు చెబుతున్నప్పటికీ,దీనిపై భి న్నాభిప్రాయాలు ఉన్నాయి.ఎమ్కే గ్లోబల్ విశ్లే షణ ప్రకారం..ఇళ్లలో ఉండే బంగారంలో దాదా పు 75 నుంచి 80 శాతం ఆభరణాల రూపం లోనే ఉంటుంది.భారతీయులు దీన్ని పొదుపు గా భావిస్తారు తప్ప,విక్రయించి సొ మ్ము చేసుకునే ఆస్తిగా చూడరు.అందుకే ధరలు పెరిగినా వినియోగంపై పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు అంటున్నారు.
ఆర్బీఐ :
కేవలం ప్రజలే కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా తన బంగారం ని ల్వలను పెంచుకుంటోంది.2024 నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ సుమారు 75 టన్నుల బం గారాన్ని కొనుగోలు చేసింది.దీంతో మొత్తం నిల్వలు 8 80 టన్నులకు చేరాయి.యుద్ధా లు,ఆర్థిక అనిశ్చితి సమయాల్లో బంగారం సురక్షితమైన పెట్టుబడి కావడంతో కేంద్ర బ్యాం కులు కూడా దీని వైపు మొగ్గు చూపుతున్నాయి.అయితే ఆర్థిక పరంగా చూస్తే బంగారం ఒక ఉత్పా దకత లేని ఆస్తి అని,ప్రజలు ఈటీఎఫ్ వంటి బాండ్ల వైపు మళ్లాలని నిపుణులు సూచిస్తున్నా,భౌతిక బంగారంపై మోజు మాత్రం తగ్గడం లేదు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....