తాజ్ హోటల్ వద్ద కోటి రూపాయలు దోపిడీ...నిందితుడి అరెస్ట్...
తాజ్ హోటల్ వద్ద కోటి రూపాయలు దోపిడీనిందితుడి అరెస్ట్
హైదరాబాద్లోని తాజ్ హోటల్ పరిసరాల్లో జరిగిన కోటి రూపాయల దోపిడీ కేసులో పోలీసులకు కీలక విజయం లభించింది.ఇండియన్ కరెన్సీకి బదులుగా క్రిప్టో కరెన్సీ ఇ స్తామంటూ నమ్మించి మెహిదీపట్నంకు చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి కోటి నగదును దో చుకెళ్లిన ఘటనలో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల కథనం ప్రకా రం...క్రిప్టో కరెన్సీ లావాదేవీల పేరుతో ముఠా ముందుగా వ్యాపారవేత్తను సంప్రదించిం ది.భద్రతగా,నమ్మకంగా డీల్ చేస్తామంటూ తాజ్ హోటల్ వద్దకు పిలిచిన నిందితులు,అ క్కడే వ్యాపారవే త్తను మోసం చేసి నగదుతో పరారయ్యారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ,సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్ అయిన నిందితుడిని విచారిస్తున్న పోలీసులు, ఈ దోపిడీకి సంబం ధించిన మిగతా సభ్యుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశా రు.క్రిప్టో కరెన్సీ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,పెద్ద మొత్తాల లావాదేవీలు చేసే టప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.
Comments
Post a Comment